వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాతాళానికి సెన్సెక్స్, ఆరంభంలోనే 1000 పాయింట్ల పతనం, నిమిషంలో రూ. 5 లక్షల కోట్లు ఆవిరి!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: అమెరికా మార్కెట్ల భారీ పతనం ప్రభావం భారత స్టాక్ మార్కెట్ మదుపరుల సెంటిమెంట్ ను దారుణంగా దెబ్బతీసింది. మంగళవారం ఉదయం ప్రీ ఓపెన్ మార్కెట్ సెషన్ లో 700 పాయింట్ల నష్టాన్ని చూపిన సెన్సెక్స్, 9.15 గంటల సమయంలో ట్రేడింగ్ ప్రారంభం కాగానే 1000 పాయింట్లకు పైగా పడిపోయింది.

ఒక్క నిమిషం వ్యవధిలో 3 శాతానికి పైగా దిగజారిన సెన్సెక్స్ సూచిక, 9.20 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలిస్తే 1,041 పాయింట్లు పడిపోయి 33,715.69 పాయింట్లకు చేరింది.
సోమవారం రూ. 1,47,95,747 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్, మంగళవారం ఉదయం రూ. 5 లక్షల కోట్లకు పైగా దిగజారి రూ. 1,42,51, 795 కోట్లకు చేరింది.

అమెరికా మార్కెట్ల ప్రభావంతో...

అమెరికా మార్కెట్ల ప్రభావంతో...

స్టాక్ మార్కెట్‌కు సంబంధంచి 2015 తర్వాత ఇవే అత్యంత కనిష్ట స్థాయి సూచీలు. అసలే పన్ను ఆందోళనలతో భారీగా నష్టపోతున్న సూచీలు, అమెరికా మార్కెట్ల ప్రభావంతో ఒక్కసారిగా క్రాష్‌ అయ్యాయి. భారీగా అమ్మకాలు చోటు చేసుకున్నాయి. మరో వైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ ఏకంగా 323 పాయింట్లు పడిపోయి 10,343 పాయింట్లకు చేరింది. నిఫ్టీ-50లో ఒక్క కంపెనీ కూడా లాభాల్లో లేకపోవడం గమనార్హం.

ఆర్బీఐ పాలసీ కూడా...

ఆర్బీఐ పాలసీ కూడా...

మరోవైపు రిజర్వు బ్యాంక్ ఆఫ్‌ ఇండియా పాలసీ కూడా ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. ద్రవ్యోల్బణ భయాలు పెరగడంతో కీలక వడ్డీరేటు అయిన రెపోను పెంచే అవకాశాలున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో మదుపరులు భయపడుతున్నారు.

 ఎల్‌టీసీజీ పన్ను, ద్రవ్యలోటు ప్రభావం...

ఎల్‌టీసీజీ పన్ను, ద్రవ్యలోటు ప్రభావం...

అటు బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఎల్‌టీసీజీ పన్ను, ద్రవ్యలోటు కూడా మార్కెట్లను పడగొడుతోంది. అమెరికా స్టాక్‌మార్కెట్లు డోజోన్స్‌, ఎస్‌ అండ్‌ పీ సూచీలు అతిపెద్ద ఇంట్రాడే పతనాలను నమోదుచేశాయి. వాల్‌స్ట్రీట్‌ ఎఫెక్ట్‌తో ఆసియన్‌ మార్కెట్లు భారీగా పడిపోయాయి. జపాన్‌ నిక్కీ 4.6 శాతం, ఆస్ట్రేలియన్‌ షేర్లు 3.0 శాతం క్షీణించాయి. అక్టోబర్‌ నుంచి ఇవే అ‍త్యంత కనిష్ట స్థాయిలు. దక్షిణ కొరియా షేర్లు కూడా 2 శాతం పడిపోయాయి.

ఇప్పుడు రూపాయి విలువ ఎంతంటే...

ఇప్పుడు రూపాయి విలువ ఎంతంటే...

టాటా మోటార్స్, వీఈడీఎల్, యాక్సిస్ బ్యాంక్ తదితర కంపెనీలు 5 నుంచి 8 శాతం మేరకు నష్టాల్లో నడుస్తున్నాయి. టాటా మోటార్స్‌ షేర్లు ఫలితాల ప్రకటన తర్వాత 10 శాతం పైగా క్రాష్‌ అయ్యాయి. మెటల్‌, రియాల్టీ, క్యాపిటల్‌ గూడ్స్‌, బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ స్టాక్స్‌ ఎక్కువగా నష్టపోతున్నాయి. డాలర్‌తో పోలిస్తే దేశీయ రూపాయి విలువ కూడా భారీగా 29 పైసలు బలహీనపడి 64.36 వద్ద ప్రారంభమైంది.

English summary
The Sensex and Nifty suffered a bloodbath today, tracking a selloff in global equity markets. Overnight, the Wall Street suffered its biggest intraday decline in history. The Dow Jones Industrial Average ended with a loss of about 1,200 points - nearly 4.6 per cent. Shares in other Asian markets were also under strong selling pressure, with Japan's Nikkei down about 5 per cent. The Sensex fell as much over 1,200 points to 33,482 while Nifty tumbled below 10,300. The rupee also fell to 64.38 against US dollar, as compared to Monday's close of 64.06.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X