Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పారాసెటమాల్, బీపీ టాబ్లెట్ల రేట్లు భారీగా పెంపు?

యుద్ధం అంటే కేవలం తుపాకుల మోత, క్షిపణుల దాడి మాత్రమే కాదు.. అది సామాన్యుడి వంటింటి బడ్జెట్‌ను, చివరికి ప్రాణరక్షక మందుల బిల్లును కూడా తలకిందులు చేస్తుంది. పశ్చిమాసియాలో (మిడిల్ ఈస్ట్) కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ఇప్పుడు నేరుగా ఫార్మా రంగంపై పడింది. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు స్తంభించిపోవడంతో, మందుల తయారీకి వాడే ముడిపదార్థాల ధరలు కళ్లు చెదిరే రీతిలో పెరిగాయి. ఫలితంగా మార్కెట్లో మందుల ధరలు గరిష్ఠంగా 180 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఫార్మా రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారతీయ ఫార్మా పరిశ్రమ ముడిపదార్థాల కోసం (Active Pharmaceutical Ingredients - API) ప్రధానంగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతుంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణా కష్టతరం కావడం, కంటైనర్ల కొరత ఏర్పడటంతో దిగుమతి వ్యయం భారీగా పెరిగింది. కొన్ని రకాల కీలక రసాయనాల ధరలు ఏకంగా 200 నుంచి 300 శాతం వరకు పెరగడం గమనార్హం. దీనికి తోడు పెట్రోకెమికల్స్ ధరలు, ప్యాకేజింగ్ మెటీరియల్ ఖర్చులు కూడా తోడవడంతో ఫార్మా కంపెనీలు ఉత్పత్తి వ్యయాన్ని భరించలేక ధరల పెంపు వైపు మొగ్గు చూపుతున్నాయి.

West Asia War Impact Essential Medicine Prices Set to Skyrocket by 180 Percentage

ఏయే మందులపై ప్రభావం?

ప్రజలు నిత్యం వాడే అత్యవసర మందులన్నీ ఇప్పుడు ఖరీదైనవిగా మారనున్నాయి.

  • సాధారణ మందులు: జ్వరం కోసం వాడే పారాసెటమాల్, వివిధ రకాల పెయిన్ కిల్లర్స్ (నొప్పి నివారణలు).
  • యాంటీ బయాటిక్స్: ఇన్‌ఫెక్షన్ల నివారణకు వాడే అజిత్రోమైసిన్, అమోక్సీసిలిన్ వంటి యాంటీ బయాటిక్స్.
  • దీర్ఘకాలిక వ్యాధులు: బీపీ (రక్తపోటు), డయాబెటిస్ (మధుమేహం), గుండె సంబంధిత వ్యాధులకు వాడే మందుల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి.
పెయిన్‌కిల్లర్లపై కేంద్రం కొరడా.. ఇక ఈ నొప్పుల మాత్రలు పూర్తిగా నిషేదం
పెయిన్‌కిల్లర్లపై కేంద్రం కొరడా.. ఇక ఈ నొప్పుల మాత్రలు పూర్తిగా నిషేదం

ఉత్పత్తి నిలిపివేత దిశగా కంపెనీలు

మరోవైపు, పెరిగిన ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వ నిబంధనలు (DPCO) అడ్డంకిగా మారాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు విక్రయించే వీలు లేకపోవడంతో, చిన్న మరియు మధ్యతరహా ఫార్మా యూనిట్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. లాభాలు రాకపోగా, పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఫార్మా కంపెనీలు షిఫ్టులను తగ్గించేశాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మార్కెట్లో మందుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బీపీ బాధితులకు బిగ్ రిలీఫ్, ఇక రోజూ మాత్రలు అవసరం లేదు- ఏడాదికి రెండు ఇంజెక్షన్లు చాలు..!!
బీపీ బాధితులకు బిగ్ రిలీఫ్, ఇక రోజూ మాత్రలు అవసరం లేదు- ఏడాదికి రెండు ఇంజెక్షన్లు చాలు..!!

ప్రభుత్వ జోక్యం అవసరం

ఈ సంక్షోభం నుండి గట్టెక్కాలంటే కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఫార్మా అసోసియేషన్లు కోరుతున్నాయి. దిగుమతి సుంకాలను తగ్గించడం లేదా డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (DPCO) కింద ధరల సవరణకు తక్షణ అనుమతులు ఇవ్వడం వంటి చర్యలు చేపడితేనే పరిశ్రమ నిలబడుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. లేనిపక్షంలో సామాన్యుడు జబ్బు పడితే మందులు కొనలేని స్థాయికి ధరలు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+