Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డ్రీమ్ ఫోల్క్స్ కు బిగ్ షాక్ ఇవ్వనున్న బ్యాంకింగ్ సంస్థలు..!

భారత్ లోని ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థలు ఇప్పుడు డ్రీమ్ ఫోల్క్స్ సంస్థ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. డ్రీమ్ ఫోల్క్స్ లో లాంజ్ సేవల అంతరాయం వల్ల విమాన ప్రయాణికులు పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐసీఐసీఐ, యాక్సెస్ బ్యాంక్, మాస్టర్ కార్డ్ లాంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.

డ్రీమ్ ఫోల్క్స్ అనేది విమానాశ్రయ సేవలను అందించే సంస్థ, ఇది విమానాశ్రయాలలో ప్రయాణీకులకు వివిధ రకాల సేవలను అందిస్తుంది. అయితే గతేడాది సెప్టెంబర్ 22 వ తేదీన
డ్రీమ్ ఫోల్క్స్ లోని సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో దేశవ్యాప్తంగా వేల మంది బ్యాంకు కస్టమర్లు, కార్డు వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ సమస్యను 24 గంటల్లో డ్రీమ్ ఫోల్క్స్ పరిష్కరించినప్పటికీ బ్యాంకింగ్ సంస్థలు మాత్రం ఇతర వ్యవస్థపై మొగ్గు చూపాలని భావిస్తున్నాయి.

అయితే ఈ విషయంపై ఐసీఐసీఐ, మాస్టర్ కార్డ్, యాక్సెస్ బ్యాంకు ఇప్పటివరకైతే అధికారికంగా ప్రకటన చేయలేదు. అటు డ్రీమ్ ఫోల్క్స్ సంస్థ కూడా దీనిపై స్పందించలేదు. ఇక దేశంలోని అన్ని ప్రముఖ విమానాశ్రయాల్లో డ్రీమ్ ఫోల్క్స్ సంస్థ లాంజ్ సేవలను అందిస్తోంది. దేశంలోని వైమానిక మార్కెట్ లో 90శాతం షేర్ ఈ సంస్థ సొంతం.

అయితే గతేడాది సెప్టెంబర్ 22 వ తేదీన డ్రీమ్ ఫోల్క్స్ లోని లాంజ్ సేవలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో దేశంలోని 34 ఎయిర్ పోర్టుల్లో 49 లాంజ్ సేవలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో కోల్ కతా, చెన్నైలోని విమానాశ్రయాల్లో ఆహార సేవలు అందించే ట్రావెల్ ఫుడ్ అండే సర్సీసెస్ సంస్థ..డ్రీమ్ ఫోల్క్స్ సంస్థపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని బెదిరింపులు కూడా చేసింది.

ఇదే వ్యవహారంపై అదానీ గ్రూప్ ప్రతినిధి మాట్లాడుతూ తమ విమానాశ్రయాల్లో ప్రయాణికులకు అంతరాయం లేకుండా సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి సంబంధిత బ్యాంకులతో చర్చిస్తున్నామని వివరించారు. ఇక అదానీ గ్రూప్ దేశంలోని అనేక విమానాశ్రయాలను పర్యవేక్షిస్తోంది. GMR, అదానీ సంస్థలు కలిసి 80-85 శాతం విమానాశ్రయాలకు సేవలందిస్తున్నాయి. ఈ సంస్థలు థర్డ్-పార్టీ సంస్థల ద్వారా లాంజ్ సేవలనూ అందిస్తున్నాయి.

ICICI Axis and MasterCard to Exit DreamFolks Partnership After Lounge Service Disruptions

డ్రీమ్ ఫోల్క్స్ సంస్థ భారత్ లో విమానాశ్రయ సంబంధిత సేవలను అందించేందుకు 2013లో ఏర్పడింది. ఇది బ్యాంకులు, విమానయాన సంస్థలకు వివిధ రకాల సేవలను అందిస్తోంది. ఇందులో విమానాశ్రయ లాంజ్ సేవలు ప్రధానమైనవిగా చెప్పవచ్చు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ.1,292 కోట్ల ఆదాయాన్ని రాబట్టింది. మరోవైపు రూ. 65 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఈ సంస్థ లాంజ్ సేవలతో పాటు ఆహారం, కూల్ డ్రింక్స్, ప్రయాణ ఏర్పాట్లు వంటి ఇతర సేవలను కూడా అందిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+