Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు పెట్రోలు బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తుండటం వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ఇంధన సంస్థలు నిల్వలకు కొరత లేదని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. అసలు ఈ గండం ఎందుకు వచ్చింది? ఇది యుద్ధం వల్ల వచ్చిన అంతరాయమా లేక ఆర్థిక సంవత్సర ముగింపు లెక్కల చిక్కా? నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ సంక్షోభం వెనుక అంతర్జాతీయ కారణాల కంటే దేశీయ 'బ్యాలెన్స్‌ షీట్‌' వ్యూహాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుత పెట్రోలు కొరతకు ప్రధాన కారణం చమురు సంస్థలు, బ్యాంకులు అనుసరిస్తున్న కఠిన నిబంధనలేనని తెలుస్తోంది. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో, కంపెనీలు తమ లెక్కలను సరిచేసుకునే పనిలో పడ్డాయి. సాధారణంగా డీలర్లకు ఇచ్చే రుణ పరిమితిని ఈ సమయంలో తగ్గించి, 'ముందు నగదు చెల్లిస్తేనే స్టాక్'(అడ్వాన్స్ పేమెంట్) అనే నిబంధనను విధిస్తున్నాయి. పాత బాకీ ఒక్క రూపాయి ఉన్నా కొత్త లోడ్‌ ఇచ్చేందుకు సంస్థలు నిరాకరిస్తున్నాయి. అటు బ్యాంకులు కూడా మొండి బకాయిలను తగ్గించుకునే క్రమంలో డీలర్లకు స్వల్పకాలిక రుణాలు ఇవ్వడం నిలిపివేశాయి. ఈ నగదు సర్దుబాటు చేయలేక డీలర్లు కొత్త ఆర్డర్లు పెట్టకపోవడంతోనే బంకుల్లో బోర్డులు పడుతున్నాయి.

Petrol Shortage Myth vs Reality Why No Stock Boards are Appearing at Fuel Stations Despite Ample Reserves

ప్రైవేటు భారం.. పెరిగిన గిరాకీ..

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ప్రైవేటు చమురు సంస్థలు తమ విక్రయాలను తగ్గించుకున్నాయి. దీంతో ఆ భారం మొత్తం ప్రభుత్వ రంగ బంకులపై పడింది. దీనికి తోడు చిన్న చిన్న బంకుల్లో 'స్టాక్ అయిపోతుంది' అనే వదంతులు తోడవ్వడంతో వినియోగదారులు ఒక్కసారిగా బంకులకు పోటెత్తారు. రెండు రోజులు రావాల్సిన నిల్వలు కొన్ని గంటల్లోనే ఖాళీ అవుతుండటంతో సరఫరా గొలుసు (Supply Chain) దెబ్బతింటోంది.

పెట్రోల్ కొరత లేదు.. బంకుల్లో ఫుల్ స్టాక్! తేల్చిచెప్పిన ప్రభుత్వం
పెట్రోల్ కొరత లేదు.. బంకుల్లో ఫుల్ స్టాక్! తేల్చిచెప్పిన ప్రభుత్వం

యుద్ధ మేఘాలు.. పెరిగిన బీమా భారం

భౌగోళిక రాజకీయాలు కూడా ఈ పరిస్థితిని కొంత ప్రభావితం చేస్తున్నాయి. హర్మూజ్‌ జలసంధిలో ఉద్రిక్తతల వల్ల నౌకల ప్రయాణం ఆలస్యమవుతోంది. గతంలో వారం రోజుల్లో చేరాల్సిన ముడి చమురు ఇప్పుడు 15-20 రోజులు పడుతోంది. నౌకలపై దాడుల భయంతో బీమా ప్రీమియాలు కూడా 30-50% మేర పెరగడం చమురు దిగుమతులపై అదనపు భారాన్ని మోపుతోంది. అయితే, ఇది దీర్ఘకాలిక ప్రభావమే తప్ప ఇప్పటికిప్పుడు బంకులు ఖాళీ అవ్వడానికి ఇది మాత్రమే కారణం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ట్రంప్‌కు వార్నింగ్! మళ్ళీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
ట్రంప్‌కు వార్నింగ్! మళ్ళీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?

ఆందోళన వద్దు: ప్రభుత్వ భరోసా

దేశంలో ఇంధన నిల్వలకు ఎలాంటి ఇబ్బందీ లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దాదాపు 60 నుంచి 90 రోజులకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రిఫైనరీలు 100% సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పేర్కొంది. కేవలం ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఏర్పడిన ఈ చిన్నపాటి అంతరాయం త్వరలోనే సర్దుబాటు అవుతుందని, ప్రజలు ఆందోళన చెంది అనవసరంగా నిల్వ చేసుకోవద్దని సూచిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+