Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

5 రోజుల్లో లక్ష కోట్లకు పైగా సంపద ఆవిరి! దేశంలోనే అతిపెద్ద కంపెనీకి భారీ షాక్ !!

గత వారం షేర్ మార్కెట్లో గణనీయమైన హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. ముఖ్యంగా సెన్సెక్స్ టాప్-10 జాబితాలోని పలు కంపెనీల పెట్టుబడిదారులు నష్టాలను చవిచూశారు. మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు టాటా గ్రూప్‌కు చెందిన టీసీఎస్, ఎల్ఐసీ వంటి సంస్థలకు గత వారం నిరాశజనకంగా ముగిసింది. అయితే ఈ పతనంలో రిలయన్స్ పెట్టుబడిదారులు అతిపెద్ద షాక్‌ను చవిచూశారు. కేవలం 5 పని దినాల్లో వారి సంపద రూ.లక్ష కోట్లకు పైగా తగ్గింది.

6 కంపెనీలకు రూ.2.22 లక్షల కోట్ల నష్టాలు
గత వారంలో స్టాక్ మార్కెట్ లో వచ్చిన పతనం కారణంగా బే స్టాక్ ఎక్స్ఛేంజ్‌ని 30 షేర్ల సెన్సెక్స్ 294.64 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఈ పరిణామంలో సెన్సెక్స్ టాప్-10లో 6 కంపెనీల మార్కెట్ క్యాప్ సంయుక్తంగా రూ.2.22 లక్షల కోట్ల భారీ పతనాన్ని చవిచూసింది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎల్‌ఐసీ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. అయితే ఈ పతనంలో కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ సహా నాలుగు సెన్సెక్స్ కంపెనీల మార్కెట్ విలువ పెరిగి పెట్టుబడిదారులకు ఊరటనిచ్చింది.

Reliance Investors Lose Rs 1 Lakh Crore in 5 Days

రిలయన్స్ సహా పలు కంపెనీలకు భారీ నష్టాలు

నష్టాలను మరింత వివరంగా పరిశీలిస్తే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ గత వారం రూ. 18,83,855.52 కోట్లకు తగ్గింది. దీని అర్థం కేవలం 5 పని దినాల్లో రిలయన్స్ పెట్టుబడిదారులు రూ. 1,14,687.7 కోట్లు నష్టపోయారు. దీనితో పాటు టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ. 29,474.56 కోట్లు తగ్గి రూ.6,29,621.56 కోట్లకు చేరింది. భారతదేశపు అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ మార్కెట్ విలువలో రూ. 23,086.24 కోట్ల పతనం నమోదై, రూ.5,60,742.67 కోట్లకు తగ్గింది.

అంతేకాకుండా, టాటా గ్రూప్ కంపెనీ టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.20,080.39 కోట్ల పతనంతో రూ. 11,34,035.26 కోట్లకు తగ్గింది. ఇతర కంపెనీలలో బజాజ్ ఫైనాన్స్ పెట్టుబడిదారులకు రూ. 17,524.3 కోట్ల నష్టాన్ని కలిగించగా, దాని మార్కెట్ విలువ రూ. 5,67,768.53 కోట్లకు తగ్గింది. అదేవిధంగా హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) మార్కెట్ క్యాప్ రూ. 17,339.98 కోట్లు పడిపోయి రూ. 5,67,449.79 కోట్లకు చేరింది. ఈ నష్టాలు మార్కెట్ అస్థిరతను స్పష్టం చేస్తున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పెట్టుబడిదారులకు పండగ వాతావరణం
నష్టాలకు భిన్నంగా హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్‌తో సహా నాలుగు కంపెనీల పెట్టుబడిదారులు ఈ వారం లాభపడ్డారు. మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.37,161.53 కోట్ల భారీ పెరుగుదలతో రూ.15,38,078.95 కోట్లకు చేరింది. అంతే కాకుండా ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్‌లో రూ.35,814.41 కోట్ల పెరుగుదల నమోదై ఇది రూ.10,53,823.14 కోట్లకు ఎగబాకింది.దీనితో పాటు, టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ రూ. 20,841.2 కోట్లు పెరిగి రూ. 11,04,839.93 కోట్లకు చేరింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా తన పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందించింది. ఎస్‌బీఐ మార్కెట్ క్యాప్ రూ. 9,685.34 కోట్లు పెరిగి రూ. 7,44,449.31 కోట్లకు చేరింది. ఈ కంపెనీల సానుకూల పనితీరు మార్కెట్‌లో కొన్ని ఆశాకిరణాలను చూపింది.

నంబర్ 1 స్థానంలో కొనసాగుతోన్న ముఖేష్ అంబానీ ఆధిపత్యం
గత కొన్ని వారాలుగా దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ మార్కెట్ క్యాప్ తగ్గినప్పటికీ ఇది ఇప్పటికీ దేశంలో అత్యంత విలువైన కంపనీల జాబితాలో నంబర్ 1 స్థానంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. దీని తర్వాత వరుసగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, భారతి ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్ , బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎల్ఐసీ ఉన్నాయి. మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రిలయన్స్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+