సత్య నాదెళ్ల కీలక నిర్ణయం: 36మిలియన్ల షేర్లు అమ్మేశారు!
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన మరోసారి తన షేర్లను విక్రయించారు. 36 మిలియన్ల విలువైన 3,28,000(30శాతం) షేర్లను విక్రయించినట్లు మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
ఒక్కో షేరు విలువ 109.08 డాలర్లు నుంచి 109.68డాలర్లు వరకు అమ్మినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. సత్యనాదెళ్లకు ఉన్న వ్యక్తిగత ఆర్థిక కారణాల వల్లే ఆయన తన షేర్లను అమ్ముకున్నారని సంస్థ ప్రతినిధి తెలిపారు.

కంపెనీని గెలుపు బాటలో నడిపించడానికి నాదెళ్ల ఎల్లప్పుడు కృషి చేస్తూ ఉంటారని తెలిపింది. కాగా, మైక్రోసాఫ్ట్ సీఈవోగా 2014లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన తన వాటాలోని షేర్లను విక్రయించడం ఇది రెండోసారి.
రెండు సంవత్సరాల క్రితం నాదెళ్ల 8.3 మిలియన్ డాలర్ల విలువైన 1,43,000 షేర్లను విక్రయించిన విషయం తెలిసిందే. స్టాక్ సేల్ నివేదిక ప్రకారం ఆయన దగ్గర ఇంకా 7,78,596షేర్లు ఉన్నాయి. గతేడాది ఆయన 1.45మిలియన్ డాలర్లు వేతనంగా అందుకున్నారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications