స్టాక్మార్కెట్లో రికార్డుల హోరు: ట్రిపుల్ సెంచరీ, రూపాయి మారకం విలువ ఇలా...
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లో రికార్డుల జోరుకొనసాగుతోంది. బుధవారం 35 వేలకు ఎగువన స్థిరంగా ముగిసిన సెన్సెక్స్ గురువారం భారీ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ లాభాలను సాధించింది.
అటు నిఫ్టీ 10,850 వద్ద మరో గరిష్టాన్ని అధిగమించింది. అంతేకాదు 11 వేల వైపు శరవేగంగా పయనిస్తోంది. బ్యాంకింగ్ సెక్టార్ మరోసారి పుంజుకుంది. బ్యాంక్ నిఫ్టీ సరికొత్త రికార్డ్ స్థాయిని దాటి ట్రేడ్ అవుతోంది. భారీ లాభాలతో మార్కెట్లకు జోష్ నిస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐ, ఎస్ బ్యాంక్, ఐసీఐసీఐ లాభపడుతుండగా... ఇన్ఫ్రాటెల్, ఇన్ఫోసిస్, గెయిల్, ఐడీసీ, హిందాల్కో, అంబుజా, విప్రో, అల్ట్రాటెక్, హెచ్పీసీఎల్, వేదాంతా నష్టపోతున్నాయి.
డాలర్తో రూపాయి మారకం ఇలా...
డాలర్తో రూపాయి మారకం విలువ గురువారం స్వల్ప లాభాలతో మొదలైనప్పటికీ, కొద్ది నిముషాల్లోనే నష్టాల్లోకి మళ్లింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 5 పైసల లాభంతో 63.83 దగ్గర ప్రారంభమయ్యింది.
దేశీయ స్టాక్ సూచీలు నూతన జీవితకాల గరిష్టస్థాయికి చేరుకోవడంతో ట్రేడింగ్ ప్రారంభసమయానికి డాలర్ ఇన్ఫ్లో పెరిగి రూపాయి విలువ బలపడింది. అయితే.. ఆవెంటనే బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలరుకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో 11 పైసల వరకు నష్టపోయింది.
10
గంటల
సమయానికి
డాలరుతో
రూపాయి
మారకం
విలువ
63.94
వద్ద
ట్రేడవుతోంది.
బుధవారం
నాటి
ఫారెక్స్
మార్కెట్
ముగింపు
సమయానికి
డాలరుతో
రూపాయి
మారకం
విలువ
16
పైసలు
బలపడి
63.88
వద్ద
ముగిసిన
విషయం
తెలిసిందే.