Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వామ్మో.. నిమిషాల్లోనే రూ. 8 లక్షల కోట్లు హాంఫట్..

భారతీయ స్టాక్ మార్కెట్ సోమవారం ట్రేడింగ్‌లో భారీ పతనాన్ని చవిచూసింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల గుండెల్లో గుబులు రేపడంతో, మార్కెట్లు ప్రారంభమైన నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 8 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు విఫలం కావడం, దానికి తోడు యుద్ధ వాతావరణం నెలకొనడం దేశీయ సూచీలను కుంగదీసింది.

కుప్పకూలిన సూచీలు

గత వారం సానుకూల సంకేతాలతో 6% వృద్ధిని నమోదు చేసిన మార్కెట్లు, ఈ వారం ప్రారంభంలోనే ఒక్కసారిగా డీలా పడ్డాయి. ఉదయం 9:15 గంటలకే సెన్సెక్స్ 1,388.61 పాయింట్లు (1.79%) నష్టపోయి 76,161 వద్దకు చేరగా, నిఫ్టీ 418.55 పాయింట్లు (1.74%) పతనమై 23,632 వద్ద ట్రేడ్ అయింది. ఒక్క దశలో సెన్సెక్స్ ఏకంగా 1,624 పాయింట్ల కనిష్టానికి పడిపోవడంతో ట్రేడింగ్ ఫ్లోర్ అంతా ఆందోళన నెలకొంది.

Indian Stock Markets Crash Sensex Drops 1 624 Pts Rs 8 Lakh Crore Wiped Out as US-Iran Peace Talks Fail in 2026

పతనానికి ప్రధాన కారణాలివే..

విఫలమైన శాంతి చర్చలు:

ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిశాయి. దీనికి తోడు, ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధిని తమ నౌకాదళం అడ్డుకుంటుందని సంచలన ప్రకటన చేయడంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.

కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం..
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం..

మండిపోతున్న ముడిచమురు:

హోర్ముజ్ జలసంధి మూసివేత భయాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 7% పెరిగి బ్యారెల్‌కు $102కి చేరింది. ఇరాన్‌కు రుసుము చెల్లించే నౌకలను అడ్డుకుంటామన్న ట్రంప్ హెచ్చరికలు ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతాయన్న ఆందోళన మార్కెట్‌ను కలవరపెట్టింది.

బ్యాంకింగ్ రంగం అతలాకుతలం:

ఈ భారీ అమ్మకాల ధాటికి బ్యాంకింగ్ రంగం తీవ్రంగా దెబ్బతింది. బ్యాంక్ నిఫ్టీ 2 శాతానికి పైగా పడిపోగా, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ బ్యాంకుల సూచీలు 3 శాతం వరకు నష్టాలను మూటగట్టుకున్నాయి.

Stock Market Crash: దలాల్ స్ట్రీట్‌లో రక్తపాతం. యుద్ధం అక్కడ.. నష్టం ఇక్కడ!
Stock Market Crash: దలాల్ స్ట్రీట్‌లో రక్తపాతం. యుద్ధం అక్కడ.. నష్టం ఇక్కడ!

బల్ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల సంకేతాలు, ముఖ్యంగా ఇంధన ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణ ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ఈ అనిశ్చితి కొనసాగితే మార్కెట్లు మరిన్ని నష్టాలను చవిచూసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+