దేశవ్యాప్త సమ్మె.. రంగంలోకి 1.2 కోట్ల మంది కార్మికులు!

దేశవ్యాప్తంగా డెలివరీలు, క్యాబ్ సేవలతో ప్రజా జీవితాన్ని పరుగులు పెట్టించే గిగ్ కార్మికుల (Gig Workers) బతుకులు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. ఒకవైపు భానుడి భగభగలు.. మరోవైపు ఒక్కసారిగా పెరిగిన ఇంధన ధరలు వారి జీవనోపాధిని దెబ్బతీశాయి. కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్, డీజిల్‌పై రూ. 3 మేర భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ శనివారం గిగ్ కార్మికులు దేశవ్యాప్త తాత్కాలిక సమ్మెకు దిగారు.

'గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ (GIPSWU)' పిలుపు మేరకు రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ భాగస్వాములు తమ సేవలను పూర్తిగా నిలిపివేశారు. ఈ పెట్రో మంట దేశంలోని సుమారు 1.2 కోట్ల మంది గిగ్ కార్మికులపై నేరుగా ప్రభావం చూపుతోందని యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది.

Swiggy Zomato and Ola Uber Partners on Strike Fuel Price Hike Impacts Millions of Indian Gig Workers

మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర అస్థిరత, ఇరాన్‌తో పెరుగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు మరియు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌లో చమురు రవాణాకు ఏర్పడిన అంతరాయాల కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీని ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ. 3 మేర పెంచింది. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రిటైల్ ఇంధన ధరలను సవరించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు. కొత్త ధరలు ఇవే!
భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు. కొత్త ధరలు ఇవే!

కిలోమీటరుకు రూ. 20 ఇవ్వాల్సిందే

ఇంధన ధరల పెంపుతో తమ ఆదాయం పూర్తిగా అడుగంటిపోతోందని, ఇది గిగ్ కార్మికులకు 'నేరుగా తగిలిన దెబ్బ' అని GIPSWU అధ్యక్షురాలు సీమా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. "స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఓలా, ఊబర్ వంటి కంపెనీల్లో పనిచేసే డెలివరీ బాయ్స్, డ్రైవర్లు ఈ తీవ్రమైన ఎండల్లో, భారీ ట్రాఫిక్‌లో రోజుకు 10 నుండి 14 గంటల పాటు శ్రమిస్తున్నారు. ఇప్పటికే ఎల్‌పీజీ గ్యాస్ ధరల పెంపుతో ఇబ్బందులు పడుతున్న సామాన్యుడిపై ఈ భారం మోపడం దారుణం. ప్రభుత్వం, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు తక్షణమే స్పందించి కనీసం కిలోమీటరుకు రూ. 20 సర్వీస్ రేటును ప్రకటించాలి. లేదంటే లక్షలాది మంది కార్మికులు ఈ రంగం నుండి నిష్క్రమించాల్సి వస్తుంది" అని ఆమె హెచ్చరించారు.

నైట్ టైమ్ నో పెట్రోల్!
నైట్ టైమ్ నో పెట్రోల్!

ద్విచక్ర వాహనాలే జీవనాధారం.. పెరగని చెల్లింపులు

దేశంలోని సుమారు 60 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులలో, ఈ 1.2 కోట్ల మంది గిగ్ కార్మికులు అత్యంత దయనీయ స్థితిని ఎదుర్కొంటున్నారని జాతీయ సమన్వయకర్త నిర్మల్ గోరానా తెలిపారు. వీరిలో అత్యధికులు ద్విచక్ర వాహనాలపైనే ఆధారపడి డెలివరీలు చేస్తుంటారు. ఇంధన ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగినప్పటికీ, అగ్రిగేటర్ కంపెనీలు అందించే చెల్లింపులు (Payouts) మాత్రం పాత రేట్ల ప్రకారమే ఉండటం అన్యాయమన్నారు. ముఖ్యంగా మహిళా కార్మికులు, రాత్రింబవళ్లు కష్టపడే డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని ఆయన పేర్కొన్నారు.

భవిష్యత్తులో మరింత పెరగనున్న గిగ్ సైన్యం

నీతి ఆయోగ్ (Niti Aayog) అంచనాల ప్రకారం, 2020-21 నాటికి భారతదేశంలో సుమారు 77 లక్షల మంది గిగ్ కార్మికులు ఉండగా, ఈ సంఖ్య 2029-30 నాటికి ఏకంగా 2.3 కోట్లకు చేరుకోనుంది. ఇంతటి భారీ ఆదరణ పొందుతున్న ఈ రంగంలో, రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ఖర్చుల భారాన్ని కార్మికులే స్వయంగా భరించాల్సి వస్తోంది. తక్షణమే కార్పొరేట్ కంపెనీలు మరియు ప్రభుత్వం కలిసి చర్చలు జరిపి సర్వీస్ చార్జీలు పెంచకపోతే, ఈ సమస్య తీవ్ర ఆహార, సేవల సరఫరా సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+