దుమ్ము దులిపిన TCS
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాలుగో త్రైమాసికం ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి కాలానికి కంపెనీ ఏకీకృత నికర లాభం గత ఏడాదితో పోలిస్తే 12 శాతానికి పైగా పెరిగింది. ఏకంగా 13,718 కోట్ల రూపాయలకు చేరుకుంది. సంస్థ రోజువారీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం కూడా 10 శాతం మేర వృద్ధిని నమోదు చేసింది. దీని విలువ 70,698 కోట్ల రూపాయలుగా లెక్క కట్టింది.
ఈ త్రైమాసికంలో ప్రతి షేరుకు కూడా 31 రూపాయల ఫైనల్ డివిడెండ్ మొత్తాన్ని చెల్లించాలని టీసీఎస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఏకగ్రీవంగా ఆమోదించారు. చివరి త్రైమాసికంలో టీసీఎస్ మూడు భారీ డీల్లను కుదుర్చుకుంది. వీటి మొత్తం కాంట్రాక్ట్ విలువ 12 బిలియన్ డాలర్లకు పైమాటే. మొదటి నుంచీ అనుసరిస్తూ వస్తోన్న 5- పిల్లర్ ఫార్ములా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కార్యకలాపాలు.. ఈ మెగా డీల్స్ కుదరడానికి కారణం అయ్యాయని టీసీఎస్ తెలిపింది.

బిల్డ్-పార్ట్నర్-అక్వైర్ విధానంలో పెట్టుబడులను విస్తరించింది టీసీఎస్. త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 5.4 శాతంపెరిగింది. ఆపరేటింగ్ మార్జిన్ 25.3 శాతానికి చేరి, 10 బేసిస్ పాయింట్ల వృద్ధిని సాధించింది. యూరప్ లో 6.1, యూకేలో 2.4 శాతం వృద్ధిని అందుకుంది. ఈ ఫలితాలపై టీసీఎస్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ కే. కృతివాసన్ మాట్లాడారు. రికార్డు స్థాయిలో 12 బిలియన్ డాలర్ల టోటల్ కాంట్రాక్ట్ వ్యాల్యూ (టీసీవీ) కూడిన త్రైమాసికం వృద్ధిని నమోదు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ప్రతికూల పరిస్థితుల్లోనూ అంచనాలకు అనుగుణంగా వృద్ధి రేటును అందుకోవడం ప్రోత్సాహకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆర్థిక అనిశ్చితి, ఏఊ విస్తరణ వంటి పరిణామాలకు అనుగుణంగా కంపెనీ తమను తాము ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుకుంటూ వచ్చామని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వార్షిక ఆదాయం 2.3 బిలియన్లను అధిగమించినట్లు టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్తీ సుబ్రహ్మణ్యం తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లాభాల స్వీకరణ అనేది అత్యంత కీలకంగా ఉండబోతోందని అన్నారు. నాలుగో త్రైమాసికంలో ఏఐ సొల్యూషన్స్ విస్తరణను వేగవంతం చేశామని వివరించారు. టీసీఎస్ ఎంటర్ప్రైజ్ ట్రాన్స్ఫార్మేషన్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ మోడర్నైజేషన్ వంటి కొత్త సెగ్మెంట్లల్లో బలమైన డీల్ మొమెంటం కనిపించింది.
హైపర్వాల్ట్ ఇన్వెస్టిమెంట్లు, ఏపెన్ ఏఐ, ఏఎండీ, ఏబీబీ వంటి సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పరచడంలో కీలక పాత్ర పోషించాయవి. ఈ పరిణామాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్-టు-ఇంటెలిజెన్స్ (Infrastructure-to-Intelligence)లో టీసీఎస్ స్థానాన్ని మరింత పటిష్టం చేసినట్టయిందని టీసీఎస్ పేర్కొంది.
-
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
IMDB అల్లు అర్జున్ టాప్-10 మూవీస్.. ‘పుష్ప2’కు దక్కని చోటు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..!












Click it and Unblock the Notifications