jewelery: కోట్ల రూపాయల నగలు సముద్రంలో విసిరేసిన స్మగ్లర్స్, ప్రభాస్ ఛత్రపతి సినిమా స్కెచ్ తో?
శ్రీలంక నుంచి భారత్కు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న దొంగలు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కోట్లో రూపాయల విలువైన బంగారాన్ని సముద్రంలో విసిరేశారు.
చెన్నై/మధురై: శ్రీలంక నుంచి భారత్కు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న దొంగలు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కోట్లో రూపాయల విలువైన బంగారాన్ని సముద్రంలో విసిరిన అరుదైన ఘటన వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. ఇండియన్ కోస్ట్ గార్డ్, చెన్నై రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అధికారులు నిందితులు పట్టకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు.
అరెస్టయిన వారిని మండపానికి చెందిన నాగూర్ కని, సాగుబేర్ సాదిక్, మోహ్మద్ సమీర్ మరకయార్పట్టినం వాసిగా గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం మండపంలోని మెరైన్ పోలీసులకు నిందితులను అప్పగించారు. అరెస్టు చేసిన వారి నుంచి 17.74 కిలోల రూ. 10.5 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన ముగ్గురు నిందితులు శ్రీలంక నుంచి భారత్కు పడవలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని కోస్ట్గార్డ్ స్టేషన్ మండపంలోని కోస్ట్గార్డ్ సిబ్బంది అనుమానాస్పదంగా అతని బోటును అడ్డుకున్నారు. ఈ సమయంలో ఇంత విలువైన బంగారాన్ని నిందితలు సముద్రంలోకి విసిరారు. ఆ సమయంలో వెంటనే కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్రంలోకి స్కూబా డైవర్లను పంపారు. సముద్రగర్భంలో బంగారాన్ని కనుగొనడంలో ఇండియన్ కోస్ట్ గార్డు సిబ్బంది విజయం సాధించారు.
గతంలో శ్రీలంక నుంచి మండపం బీచ్కు అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లు మారువేషంలో ఉన్న రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులకు పక్కా సమాచారం అందింది. సముద్రం ఒడ్డున నిఘా పెంచాలని కోస్ట్ గార్డ్ సిబ్బందిని కోరారు. అనేక ఇసుక దిబ్బలు మరియు లోతులేని సముద్రాలతో ఉన్న పోరస్ సముద్రంలో నుంచి మాదకద్రవ్యాలు మరియు బంగారు స్మగ్లర్లచే సులభంగా దోపిడీ చేయబడుతుందని సమాచారం అందడంతో ఇండియన్ అధికారులు అలర్ట్ అయ్యారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications