jewelery: కోట్ల రూపాయల నగలు సముద్రంలో విసిరేసిన స్మగ్లర్స్, ప్రభాస్ ఛత్రపతి సినిమా స్కెచ్ తో?
శ్రీలంక నుంచి భారత్కు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న దొంగలు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కోట్లో రూపాయల విలువైన బంగారాన్ని సముద్రంలో విసిరేశారు.
చెన్నై/మధురై: శ్రీలంక నుంచి భారత్కు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న దొంగలు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కోట్లో రూపాయల విలువైన బంగారాన్ని సముద్రంలో విసిరిన అరుదైన ఘటన వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. ఇండియన్ కోస్ట్ గార్డ్, చెన్నై రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అధికారులు నిందితులు పట్టకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు.
అరెస్టయిన వారిని మండపానికి చెందిన నాగూర్ కని, సాగుబేర్ సాదిక్, మోహ్మద్ సమీర్ మరకయార్పట్టినం వాసిగా గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం మండపంలోని మెరైన్ పోలీసులకు నిందితులను అప్పగించారు. అరెస్టు చేసిన వారి నుంచి 17.74 కిలోల రూ. 10.5 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన ముగ్గురు నిందితులు శ్రీలంక నుంచి భారత్కు పడవలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని కోస్ట్గార్డ్ స్టేషన్ మండపంలోని కోస్ట్గార్డ్ సిబ్బంది అనుమానాస్పదంగా అతని బోటును అడ్డుకున్నారు. ఈ సమయంలో ఇంత విలువైన బంగారాన్ని నిందితలు సముద్రంలోకి విసిరారు. ఆ సమయంలో వెంటనే కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్రంలోకి స్కూబా డైవర్లను పంపారు. సముద్రగర్భంలో బంగారాన్ని కనుగొనడంలో ఇండియన్ కోస్ట్ గార్డు సిబ్బంది విజయం సాధించారు.
గతంలో శ్రీలంక నుంచి మండపం బీచ్కు అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లు మారువేషంలో ఉన్న రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులకు పక్కా సమాచారం అందింది. సముద్రం ఒడ్డున నిఘా పెంచాలని కోస్ట్ గార్డ్ సిబ్బందిని కోరారు. అనేక ఇసుక దిబ్బలు మరియు లోతులేని సముద్రాలతో ఉన్న పోరస్ సముద్రంలో నుంచి మాదకద్రవ్యాలు మరియు బంగారు స్మగ్లర్లచే సులభంగా దోపిడీ చేయబడుతుందని సమాచారం అందడంతో ఇండియన్ అధికారులు అలర్ట్ అయ్యారు.












Click it and Unblock the Notifications