Illegal affair: ఆంటీ కోసం వెళితే పక్కలో పక్కింటి ఆంటి, గ్రహాలు రివర్స్, దెబ్బకు క్లోజ్!
చెన్నై/ మదురై/ నాగర్ కోవిల్: ఆంటీని చూసి మనసుపారేసుకున్న యువకుడు ఆమెతో ఎంజాయ్ చెయ్యాలని కలలుకన్నాడు. ఏదో ఒకరకంగా ఆంటీకి వలవేసిన ఆ యువకుడు ఎగిరిగంతేశాడు. ఆంటీ వలలో పడిన యువకుడు గిలగిలా కొట్టుకున్నాడు. ఆంటీ కోసం ఎప్పుడు పడితే అప్పుడు ఆమె ఇంటికి వెళ్లడం మొదలుపెట్టాడు. ఆంటీ మీద మోజుతో ఆ యువకుడు ఆంటీ ఇంట్లో అడుగుపెట్టాడు. ఇంట్లో ఆంటీతో పాటు పక్కింటి ఆంటీ కూడా ఉండటంతో ఆ యువకుడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అయితే ఒకేసారి గ్రహాలు మొత్తం రివర్స్ లో తిరగడంతో ఆ యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
Illegal affair: అక్క కోసం వెళ్లి ఆంటీతో జల్సా, బావకు డౌట్ వచ్చి కిటికిలో ?, అంతే కథ!
థ్రిల్లర్ సినిమా సీన్
తమిళనాడులోని నాగపట్టణం జిల్లా (నాగై జిల్లా)లోని కీజ వేలూరులోని ఎగువ వీధికి సమీపంలో ఓ చెట్టుకు ఓ యువకుడి శవం వేలాడుతూ ఉన్న విషయం గుర్తించిన స్థానికులు షాక్ అయ్యారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించి యువకుడి శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ మొదలుపెట్టారు.
అసలు ఏం జరిగిందంటే?
యువకుడి శవాన్ని పోస్టుమార్టం చేసిన వైద్యులు అది ఆత్మహత్య కాదు, హత్య అని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో శవమై కనిపించిన యువకుడు చెరునల్లూరులో ఓ రేషన్ షాప్ లో ఉద్యోగం చేస్తున్న కక్కల కాలనీలో నివాసం ఉంటున్న అయ్యప్పన్ (22) అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
ఆంటీతో కుర్రాడికి లింక్
శవమై కనిపించిన యువకుడు అయ్యప్పన్ చనిపోక ముందు చెరునల్లూరులో నివాసం ఉంటున్న ఆనందన్ భార్య రాజీపాని అలియాస్ రాజీ (37) అనే మహిళకు ఫోన్ చేశాడని పోలీసుల విచారలో వెలుగు చూసింది. అయ్యప్పన్ కంటే వయసులో రాజీ 15 ఏళ్లు పెద్దది. రాజీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా నిత్యం అయ్యప్పన్ రాజీతో ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
పిల్లోడికి డే అండ్ నైట్ మ్యాచ్
ఆనందన్ భార్య రాజీతో అయ్యప్పన్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భర్త ఆనందన్ లేని సమయంలో రాజీ ప్రియుడు అయ్యప్పన్ కు ఫోన్ చేసి రమ్మని చెప్పడం, పిల్లోడు ఊపుకుంటూ వెళ్లి ఎంజాయ్ చెయ్యడం మామూలు అయిపోయింది. ఎప్పుడుపడితే అప్పుడు అయ్యప్పన్ రాజీ ఇంటికి వెళ్లి ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు.
పక్కింటి ఆంటీ ఎంట్రీతో సీన్ రివర్స్
ఆదివారం రాత్రి శెలవు కావడంతో అయ్యప్పన్ ఫ్రెండ్స్ తో కలిసి పీకలదాక మద్యం సేవించాడు. తరువాత మద్యం మత్తులో ఉన్న అయ్యప్పన్ నేరుగా ప్రియురాలు రాజీ ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో రాజీ ఇంటిలో పక్కింటిలో నివాసం ఉంటున్న గౌతమి అనే మహిళను చూసిన అయ్యప్పన్ కు మతిపోయింది.
ఇద్దరు ఆంటీలు ఏం చేశారంటే?
తాగిన మైకంలో ఉన్న అయ్యప్పన్ తన కోరిక తీర్చాలని రాజీపై ఒత్తిడి చేశాడు. పక్కన బంధువు అయిన గౌతమి ఉందని, ఇప్పుడు వద్దని రాజీ చాలాసేపు అయ్యప్పన్ కు నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. అయితే పీకలదాక నీషా ఎక్కిపోవడంతో అయ్యప్పన్ కామంతో చెప్పినమాట వినలేదు. ప్రియురాలు రాజీని, ఆమె బంధువు గౌతమిని పట్టుకుని ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయాడు.
చంపేస్తే పీడపోతుంది
అయ్యప్పన్ రెచ్చిపోవడంతో సహనం కోల్పోయిన రాజీ, ఆమె బంధువు గౌతమి కలిసి దుప్పటితో అయ్యప్పన్ గొంతు నులిమి హత్య చేశారు. తరువాత అయ్యప్పన్ శవాన్ని తీసుకెళ్లి సమీపంలోని చెట్టుకు ఉరి వేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరించారు. అయితే పరిస్థితులు అనుకూలించక అయ్యప్పన్ చివరి ఫోన్ కాల్ ఆధారంగా అయ్యప్పన్ ప్రియురాలు అయిన రాజీ ఆంటీ, ఆమె బంధువు గౌతమి పోలీసులకు అడ్డంగా చిక్కిపోయారు.