కుప్పం ఫలితాలపై చంద్రబాబు స్పందన.. ప్రజాస్వామ్యం ఓడిందని టీడీపీ అధినేత ఆవేదన
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో కుప్పంలో తాము గెలవకపోవడంపై స్పందించారు. ఇప్పటికే వైసీపీ మంత్రులు కుప్పంలో ఓటమితో చంద్రబాబును రాజకీయాల నుండి వైదొలగాలని తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటే, చంద్రబాబు నాయుడు కుప్పం లో ఏం జరిగిందో చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు.

కుప్పంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొంటుంటే అధికారులేం చేశారు : చంద్రబాబు ప్రశ్న
కుప్పంలో తాము గెలవకపోవడం కాదని ప్రజాస్వామ్యం కుప్పంలో ఓటమి పాలైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు . కుప్పంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొంటుంటే అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. కుప్పంలో వైసీపీ గెలవలేదని, ప్రజాస్వామ్యం ఓటమి పాలైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కుప్పం ప్రజలు నా కుటుంబ సభ్యులు.. అని పేర్కొన్న చంద్రబాబు కుప్పాన్ని కలుషితం చేస్తారా అంటూ మండిపడ్డారు.

ఇలాంటి రాజకీయ నేతల కోసం తాను రాజీనామా చెయ్యాలా?
తాను రాజీనామా చేయాలని అంటున్నారని, ఇలాంటి రాజకీయ నేతల కోసం తాను రాజీనామా చెయ్యాలా అని ప్రశ్నించారు చంద్రబాబు. కుప్పంలో తన పీఏ పై మీద కూడా కేసులు పెట్టారని మండిపడ్డారు . వైసీపీ నేతలు వరుసగా ప్రెస్ మీట్ లు పెట్టి తనతో మైండ్ గేమ్ ఆడ లేరని చంద్రబాబు స్పష్టం చేశారు.
అధికార పార్టీ నాయకులు తనతో మైండ్ గేమ్ ఆడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు చంద్రబాబు నాయుడు. వైసిపి కి ఓటేయని వారిపై దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుప్పం నియోజకవర్గాన్ని మరో పులివెందులగా మారుస్తారా ?
కుప్పం తో తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందని పేర్కొన్న చంద్రబాబు శాంతికి మారుపేరుగా ఉండే కుప్పం నియోజకవర్గాన్ని కలుషితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలు తన కుటుంబ సభ్యులని పేర్కొన్న చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని మరో పులివెందుల గా మారుస్తారా అంటూ ప్రశ్నించారు.
ఎన్నికల్లో వైసీపీ ప్రలోభాలకు పాల్పడిందని, డబ్బు పంపిణీ తో పాటుగా అరాచకాలపై ఆధారాలు పంపినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు.

అక్రమాలను అడ్డుకోలేని ఎన్నికల కమిషన్ ఎందుకని చంద్రబాబు ప్రశ్న
అక్రమాలను అడ్డుకోలేని ఎన్నికల కమిషన్ ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. చాలావరకు ఏజెన్సీ ప్రాంతాలలో టిడిపి మద్దతుదారులు గెలిచారని పేర్కొన్న చంద్రబాబు అధికార పార్టీ నేతలు చేసే విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు కూడా మూడో విడత పంచాయతీ ఎన్నికల అక్రమాలపై లేఖ రాసిన చంద్రబాబు వైసీపీ అరాచకాలపై ఎన్నికల కమీషన్ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. టీడీపీ మద్దతుదారులను బెదిరించిన పోలీసుల పేర్లతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !!












Click it and Unblock the Notifications