16 మంది విద్యార్థులకు కరోనా.. ఎక్కడ, ఎలా సోకిందంటే..
కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అందుకే జనం కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏపీలో మాత్రం తగ్గేదేలేదు అంటోంది కరోనా. తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు కలకలం సృస్టిస్తున్నాయి. హాస్టల్లో ఉంటున్న 16 మంది విద్యార్ధులకు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ బాబ్జి వెల్లడించారు.
16 మంది విద్యార్థులు
కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ హాస్టల్ లో 16 మంది మెడికల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. రెండు వందల మంది వైద్య విద్యార్థులకు పరీక్షలు నిర్వహిం,గా వారిలో 16 మందికి పాజిటీవ్ గా తేలింది. దీంతో కరోనా సోకిన విద్యార్థులను హస్టల్ ఐసోలేషన్ లో ఉంచారు. వారికి కావాల్సిన అన్ని వసతుల్ని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకున్నామని ప్రిన్సిపల్ తెలిపారు.
హాస్టల్లో..
మెడికల్ కాలేజీ హాస్టల్లో ఉంటున్న ఇంతమంది విద్యార్ధులకు కరోనాకు గురికావటంతో అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ మెడికల్ విద్యార్థి ఢిల్లీలో ఫంక్షన్కు వెళ్లొచ్చిన క్రమంలో కరోనా వ్యాప్తి చెందింది ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆ విద్యార్థి వల్లే మిగిలినవారికి కూడా కరోనా సోకిందని.. అది కాస్తా హాస్టల్ కరోనా వ్యాప్తి చెందిందని చెబుతున్నారు. హాస్టల్ లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో హస్టల్ లో అందరూ అలర్ట్ అయ్యారు.
బూస్టర్ డోస్
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. వైరస్ను జయించేందుకు రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనిపై ప్రకటన రాలేదు.
హై టెన్షన్
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డిసెంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు థర్డ్ వేవ్ ఇంపాక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దానిని దాటేస్తే గానీ.. పరిస్థితి ఏంటో చెప్పలేమని ఒకవిధంగా వార్నింగ్ ఇస్తున్నారు.