హిందూ ఆలయాలంటే లెక్కలేదా.. పురాణాలు తెలియదా..?, మీ పాలసీ ఏంటీ..జగన్పై రఘురామ..
అంతర్వేది ఆలయ ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారని సీఎం జగన్ను వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. రథాన్ని తగులబెట్టినవారిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. సీఎం జగన్ ను ప్రసన్నం చేసుకోవడానికి కొందరు వైసీపీ నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

రెండు ఆలయాలకే ఒకరే ఈవోనా.. ఆలయాలంటే లెక్కలేదా
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే. ప్రమాదం కుట్ర అని ఎంపీ రఘురామకృష్ణరాజు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు ఆలయాలకు కలిపి ఒకే ఈవోను నియమిస్తారా అని ప్రశ్నించారు. హిందూ దేవాలయాలంటే లెక్కలేదా అని మండిపడ్డారు. హిందూ పురాణాలు తెలియవు.. మీ పాలసీ ఏంటి అని జగన్ సర్కార్పై విరుచుకుపడ్డారు. ఒక మతంపై దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ విధానం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

సీసీ కెమెరాలు పనిచేయలేదు..
అంతర్వేదిలో సీసీ కెమెరాలు పనిచేయలేదు అని.. ఎందుకు ఆ సమయానికి పనిచేయలేదు అని రఘురామ అనుమానం వ్యక్తం చేశారు. ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పడం తప్పా అని అడిగారు. కానీ సహచర మంత్రులకు మాత్రం వారు ఎర్రివారిలాగా కనిపిస్తున్నారని పేర్కొన్నారు. రథం ప్రమాద ఘటనపై దేవాదాయ శాఖ అధికారులను విచారణ చేయమని చెప్పడం సరికాదని రఘురామ మండిపడ్డారు

గోరుముద్ద పథకం పేరు మార్చి..
సీఎం జగన్ ప్రారంభించిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకంపై కూడా రఘురామకృష్ణరాజు స్పందించారు. గోరుముద్ద పథకానికే సంపూర్ణ పోషణ అని పేరుపెట్టారని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి సకాలంలో నిధులు రావాలంటే ప్రభుత్వ ప్రకటనల్లో కేంద్రం పేరు కూడా చేర్చితే బాగుండేదని ఆయప సూచించారు. ఏపీ మద్యం విధానంపైనా రఘురామ విమర్శలు గుప్పించారు. కాలం చెల్లిన బీర్లు అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని ఫైరయ్యారు. డేట్ అయిపోయిన బీర్లకు మళ్లీ పరీక్షలు చేయడం ఏంటని ప్రశ్నించారు. పిచ్చి పిచ్చి బ్రాండ్ల మద్యాన్ని తొలగించాలని కోరారు.
అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయ రథం కాలిపోవడం దురదృష్టకరం.
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) September 6, 2020
ఈ ఘటన పై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన వారు ఏ మతస్థులైనా కఠినంగా శిక్షించాలి అని రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారిని కోరుతున్నాను. pic.twitter.com/5HMBGbj1Vh
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications