సెల్యూట్ నేతన్న.. ఇల్లు అమ్మి జాతీయ జెండా నేసిన కార్మికుడు.. ఎంత ఖర్చయ్యిందో తెలుసా..?
ఏలూరు : నాలుగేళ్లు .. రూ. ఆరున్నర లక్షల వ్యయం .. ఆహోరాత్రుల శ్రమ. చివరికి అతుకులు, బొతుకులు లేని మువ్వన్నెల జాతీయ జెండా రూపొందింది. ఏపీకి చెందిన ఓ నేతన్న ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరేసేందుకు పడిన కష్టమిదీ. ఇందులో మరో ముఖ్య విషయమేమిటంటే .. జాతీయ జెండా రూపకల్పన కోసం తన ఇంటినే విక్రయించి దేశభక్తిని చాటుకున్నాడు. ఆయన దేశభక్తిని పలువురు కొనియాడుతున్నారు. శెభాష్ నేతన్న అంటూ సెల్యూట్ చేస్తున్నారు.

మువ్వన్నెల జెండా..
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరానికి చెందిన రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ నేత కార్మికుడు. ఎప్పుడూ విభిన్నంగా దుస్తులు నేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే ఢిల్లీలోని ఎర్రకోటపై ఎగిరే మువ్వన్నెల జెండాను తాను నేయాలనుకొన్నాడు. అయితే ఆ జెండాకు అతుకులు లేకుండా చూడాలనుకున్నాడు. దీంతో జాతీయ జెండా రూపకల్పన కత్తి మీద సాములా మారింది. తొలుత ఎర్రకోటపై ఎగిరే జెండా సైజు తెలియకపోవడం కూడా ఖర్చు ఎక్కువయ్యేందుకు దారితీసింది. దాదాపు రూ. ఆరున్నర లక్షలను జెండా తయారీ కోసం తన సొంత డబ్బులను వెచ్చించాడు.

అపసోపాలు పడుతూ ..
ఎర్రకోటపై ఎగురవేసే జెండా సైజుపై సత్యనారాయణకు స్పష్టత లేదు. దీంతో 6 x 4 సైజు అతుకులు లేకుండా కష్టపడి నేశాడు. అయితే తర్వాత తెలిసింది ఎర్రకోటపై ఎగరవేసే జెండా 8 x 12 ఉండాలని చెప్పడంతో .. నిమిషం కూడా ఆలోచించకుండా తన పని ప్రారంభించాడు. జాతీయ జెండాను రూపొందించేందుకు ఉన్న మగ్గం సరిపోలేదు. దీంతో కొత్త మగ్గం కొనుగోలు చేశాడు. మరోవైపు జెండా సైజు ప్రకారం తయారుచేసే క్రమంలో మెటీరియల్ చాలా వేస్ట్ అయ్యింది. దీంతో చాలాసార్లు జెండా కోసం మెటీరియల్ కొనుగోలు చేశారు. ఇలా అపసోపాలు పడుతూ .. ఎట్టకేలకే జాతీయ జెండాను తయారు చేశారు.

నాలుగేళ్ల కష్టం ..
జెండా రూపకల్పన కోసం వ్యయం ఎక్కువైంది. ఇందుకోసం ఎవరూ ముందుకురాకపోవడంతో .. ఖర్చంతా తానే పెట్టుకున్నాడు. తాను ఉంటున్న ఇంటిని కూడా విక్రయించాడు. అలా వచ్చిన నగదుతో అతను జెండా తయారీని పూర్తిచేశాడు. ఇందుకోసం అతనికి దాదాపు నాలుగేళ్ల సమయం పట్టింది. జెండా తయారీ కోసం రూ. ఆరున్నర లక్షలు ఖర్చయిపోయింది. చివరికి జెండా తయారీ పూర్తయిపోంది. ఇప్పుడు తన జెండాను ఎర్రకోటపై ఎగరేయాలని కోరుతున్నారు. ఇందుకు తనకు భారత ప్రభుత్వం, అధికారులు సహకరించాలని వేడుకుంటున్నారు. తన దేశం పట్ల అమితామైన ప్రేమ ఉన్న ఓ కళాకారుడు నేసిన జెండాను ఎర్రకోటపై సగర్వంగా ఎగరేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం సంబంధిత అధికారులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి .. జెండా ఎగిరేసేందుకు సహకరించాలని సాటి భారతీయులు కోరుకుంటున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications