వామ్మో.. ఏం భార్య గురూ.. భర్త ప్రైవేట్ పార్ట్స్పై వేడి నీళ్లు పోసి..
కొన్ని కొన్ని ఘటనలు విచిత్రంగా జరుగుతాయి. వినడానికే కాదు.. చదవడానికి కూడా వింతగా ఉంటాయి. అవును మీరు రీడ్ చేస్తుంది నిజమే.. భార్య/ భర్త.. లేదంటే మరొకరిలో శాడిజం కాస్త ఎక్కువే ఉంటుంది. ఆధునిక పోకడో.. చదువుకున్నామనే పొగరే తెలియడం లేదు. కానీ రోజుకో వింత ఘటన వెలుగులోకి వస్తోంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏలూరులో వెలుగుచూసింది.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అమానవీయ ఘటన జరిగింది. భార్యా భర్తల మధ్య జరిగిన గొడవలో కాస్త రచ్చకు దారితీసింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన భార్య.. తన సత్తా ఏమిటో చూయించారు. భర్తను దారణంగా హింసించి.. పైశాకిచ ఆనందం పొందారు. నిద్రపోతున్న భర్త పై వేడి, వేడి నీళ్లు పోసింది ఆ భార్య. దీంతో అతను వామ్మో.. వయ్యో అంటూ ఉండిపోయాడు. ఆ నీరు మరీ వేడిగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లలేక తప్పలేదు.
భార్య పోసిన వేడినీరు బాధితుడి శరీరంలోని ప్రైవేట్ భాగాలపై పడ్డాయి. ఇంకేముంది అతని బాధ వర్ణణాతీతం. అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కానీ అతని పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుడు ఏలూరు పత్తే బాధ సెంటర్లో టైలర్ గా పని చేస్తున్నారని తెలిసింది. విషయం తెలిసిన రెండో పట్టణ సీఐ ఆది ప్రసాద్, ఎస్సై కిషోర్ బాబు వివరాలు సేకరిస్తున్నారు.
వాస్తవానికి భార్య, భర్తల మధ్య ఏం జరిగిందో తెలియలేదు. కానీ ఆమె మాత్రం ఉగ్ర రూపం దాల్చారు. తాళి కట్టిన భర్త అని కూడా చూడలేదు. వేడి నీరు పోసి తన కసిని తీర్చుకున్నారు. తర్వాత బాధపడిందో లేదో తెలియలేదు కానీ.. తన పంతం మాత్రం నెగ్గించుకున్నారు. కోపం, తాపం ఉంటే నీళ్లు పోస్తం.. కానీ వేడి నీళ్లు పోయడం ఏంటీ రా బాబు అని నెటిజన్లు చెవులు కోరుకుంటున్నారు. మరికొందరు ఇల్లాలితో జర జాగ్రత్త సుమీ అని హెచ్చరిస్తున్నారు. ఆ వార్త మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది.