health tips: జలుబు, దగ్గు కోసం యాంటీబయాటిక్స్ కంటే ఈ చిట్కాలు ట్రై చెయ్యండి!!
శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు మనిషి శరీరం పైన దాడి చేస్తాయి. ముఖ్యంగా బాడీలో ఇమ్యూనిటీ బాగా తగ్గినప్పుడు ముందుగా జలుబు, దగ్గు వంటి సమస్యలు అటాక్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో దగ్గు, జలుబు వచ్చాయంటే తగ్గడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ సీజన్ లో దగ్గు, జలుబు నుండి బయటపడడానికి చిన్నచిన్న చిట్కాలను ఈరోజు మనం తెలుసుకుందాం.

విటమిన్లు పుష్కలంగా ఉన్న ఆహారం తింటే జలుబు, దగ్గు రావు
శీతాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలు శీతాకాలంలో బాగా వేధిస్తాయి. ఇక వాటి నుండి బయట పడాలంటే మనం ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచుకునే ఆహారపదార్థాలు తినాల్సిన అవసరం ఉంది విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఈ, మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల చాలావరకు ఊపిరితిత్తుల సమస్యలనుండి, జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.

జలుబు, దగ్గు కోసం యాంటీ బయాటిక్స్ ఉపయోగించటం మంచిది కాదు
ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం పైన శ్రద్ధ పెట్టి మంచి పౌష్టికాహారాన్ని తిన్నట్లయితే తొందరగా ఈ అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బలవర్థకమైన ఆహారం తీసుకొని శరీరాన్ని బలంగా ఉంచుకుంటే, అసలు ఇవి రాకుండానే ఉంటాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలు వేధిస్తుంటే చాలామంది యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. అయితే ఇలా జలుబు, దగ్గు కోసం యాంటీబయాటిక్స్ ఉపయోగించటం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.

నేచురల్ రెమెడీస్ తో జలుబు, దగ్గుకు చెక్ పెట్టండి
నేచురల్ రెమెడీస్ జలుబు దగ్గులను తగ్గించుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే జలుబు, దగ్గు నుండి ఉపశమనం దొరికే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు రోజుకు రెండుసార్లు పసుపు, వేడి పాలను కలిపి తీసుకుంటే కూడా ఉపశమనం దొరుకుతుంది అని చెబుతున్నారు. జలుబు బాగా వేధిస్తుంటే ఆవిరి తీసుకోవడం చేస్తే త్వరగా జలుబు తగ్గుతుందని అంటున్నారు.

దగ్గు కోసం ఈ నేచురల్ రెమిడీస్ ట్రై చెయ్యండి
ఇక దగ్గు విషయంలో తేనె, యష్టి మధురం, దాల్చిన చెక్క పొడిని రోజుకు రెండుసార్లు నీళ్ళలో కలుపుకుని తాగినా ఫలితం ఉంటుంది అని చెబుతున్నారు. మిరియాల కషాయాన్ని తాగినా, లవంగాలు నోట్లో వేసుకుని వాటి రసాన్ని మింగుతున్నా, వేడి వేడి మసాలా టీ తయారు చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. దగ్గు, జలుబుతో బాధపడేవారు శీతల పానీయాలను అస్సలు తాగకూడదు అని చెబుతున్నారు.

వేడి నీళ్ళనే త్రాగండి.. యాంటీ బయాటిక్స్ వద్దు
ఎప్పుడు నీళ్లు తాగినా కాస్త వేడిగా ఉన్న నీటిని మాత్రమే తాగాలని సూచిస్తున్నారు. చిన్న చిన్న చిట్కాలతో దగ్గు, జలుబు తగ్గించుకునే ప్రయత్నం చేయాలే తప్ప, ఏ మందులు పడితే ఆ మందులు వాడకూడదని, అలా వాడితే ఆ మందులను ఉపయోగించిన ప్రభావం శరీరంపై ఉంటుందని అంటున్నారు. శరీరాన్ని మందులు ముఖ్యంగా యాంటీ బయాటిక్స్ వీక్ చేస్తాయని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications