చంద్రబాబు కంటే ముందే సీఐడీ విచారణకు వైసీపీ ఎమ్మెల్యే: అమరావతి భూ కుంభకోణం..బట్టబయలు
అమరావతి: అమరావతి భూముల కుంభకోణం వ్యవహారంలో అనూహ్య పరిస్థితుల మధ్య ఏపీ సీఐడీ నుంచి నోటీసులను అందుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఈ నెల 23వ తేదీన విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. ఆయనతో పాటు మాజీమంత్రి పీ నారాయణ సైతం సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో వారిద్దరి కంటే ముందే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంగళగిరి శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఐడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా ఆయన కొద్దిసేపటి కిందటే ఏపీ సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు.
అమరావతిలో దళితులకు కేటాయించిన 500 ఎకరాల అసైన్డ్ భూముల అంశంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకే చంద్రబాబు, నారాయణపై సీఐడీ కేసు నమోదు చేసింది. 41 (ఎ) సీఆర్పీసీ కింద వారిద్దరికీ నోటీసులను జారీ చేసింది. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను అందజేయాల్సిందిగా సీఐడీ అధికారులు ఆళ్ల రామకృష్ణా రెడ్డిని ఆదేశించారు. దీనికోసం సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసు మేరకు ఆయన విజయవాడ సత్యనారాయణపురంలో సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్నారు.

కొన్ని డాక్యుమెంట్ల, ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవోలు, రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) ఇచ్చిన ఆదేశాలకు చెందిన కాపీలను ఆయన తన వెంట తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. వాటన్నింటినీ సీఐడీ అధికారులకు అందజేయడంతో పాటు.. అమరావతి భూ కుంభకోణం ఎలా చోటు చేసుకుంది?.. దానిపై తాను సేకరించిన వివరాలను ఆయన సీఐడీ చీఫ్ సునీల్ కుమార్, దర్యాప్తు అధికారి ఏ లక్ష్మీనారాయణ రావులకు అందజేస్తారు. ఈ కుంభకోణంలో తమకు కొన్ని అనుమానాల గురించి ఆళ్ల రామకృష్ణా రెడ్డిని అడిగి తెలుసుకుంటారని తెలుస్తోంది.
-
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!










Click it and Unblock the Notifications