సంక్రాంతి పండక్కి జగన్ షెడ్యూల్ ఇదే: ఎక్కడికెళ్తున్నారంటే?: ఆ ఆనవాయితీకి చంద్రబాబు పుల్స్టాప్
గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎల్లుండి గుంటూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. జిల్లాలోని నరసరావుపేటలో ఆలయాన్ని సందర్శించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించ తలపెట్టిన గోపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. టీటీడీ నిర్వహిస్తోన్న గుడికో గోమాత కార్యక్రమంలో భాగంగా.. ఆ ఆలయానికి గోవును అందజేస్తారు. అక్కడే సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. జిల్లాకు చెందిన హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
గుడికో గోమాత పేరు మీద టీటీడీ.. దేశంలోని అన్ని ప్రధాన ఆలయాలకు గోవును బహూకరిస్తోన్న విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ ఇప్పటికే గోవులను అందజేసే కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. తాజాగా సంక్రాంతి పండుగ నాడు నరసరావుపేటలోని ఓ దేవస్థానానికి గోవులను అందజేయనుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమానికి హాజరు కావాలని వైవీ సుబ్బారెడ్డి ఇదివరకే వైఎస్ జగన్కు ఆహ్వానం అందించారు. దీనికి ఆయన అంగీకరించారని తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రతి సంక్రాంతికి తన సొంత గ్రామం చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెకు వెళ్లడం ఆనవాయితీ. అధికారంలో ఉన్న అయిదేళ్లూ ఆయన సంక్రాంతి పండుగను కుటుంబంతో సహా నారావారి పల్లెలో జరుపుకొన్నారు. భార్య భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్తో కలిసి సొంతూరిలో సంక్రాంతి వేడుకలను జరుపుకొనే వారు. ఈ సారి ఆయన అక్కడికి వెళ్లట్లేదని తెలుస్తోంది. ఆ ఆనవాయితీకి చంద్రబాబు పుల్స్టాప్ పెట్టినట్టే కనిపిస్తోంది. హైదరాబాద్లోనే ఆయన సంక్రాంతి పండుగను జరుపుకోనున్నారని తెలుస్తోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications