అనూహ్య పరిణామం..! వైసీపీని వీడి బీజేపీలో చేరిన గుంటూరు ముస్లిం కీలక నేత..!
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బీజేపీలో చేరేందుకు ఇతర కులమతాల నేతలే సందేహిస్తున్న వేళ.. గుంటూరుకు చెందిన వైసీపీ మైనార్టీ నేత ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.
విజయవాడ: ఏపీలో ప్రస్తుతం వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయాలే సాగుతున్నాయి. వీరిద్దరి మధ్యసాగుతున్న పోరులో మూడో పక్షాన్ని ఓటర్లు పట్టించుకునే పరిస్ధితి లేదని తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం నిరూపించాయి. బీజేపీ అయితే మరోసారి డిపాజిట్లు కూడా కోల్పోయింది. ఇలాంటి తరుణంలో అధికార వైసీపీకి చెందిన ఓ రాష్ట్రస్ధాయి నేత ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు.
గుంటూరు వైసీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ చాంద్ బాషా ఇవాళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సమక్షంలో ఆయన కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి నేరుగా వచ్చి పార్టీ తీర్ధం తీసుకున్నారు.

గుంటూరు లో మున్సిపల్ కౌన్సిలర్ గా, కార్పోరేటర్ గా పనిచేసిన ఛాంద్ బాషా కాంగ్రెస్ లో పీసీసీ కార్యదర్శిగా, మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. అనంతరం వైసీపీలో మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
బీజేపీలో చేరికను చాంద్ బాషా సమర్ధించుకున్నారు. బీజేపీ ముస్లింలకు రక్షణ కల్పించడమే కాదు సంక్షేమం అమలు చేస్తోందన్నారు . భారత ప్రధాని నరేంద్రమోదీ పాలనపట్ల ఆకర్షితులయ్యానన్నారు. సోమువీర్రాజు గారి నాయకత్వంలో రాష్ట్రంలో బిజెపి బలోపేతానికి కృషిచేస్తానన్నారు. ఏపీ బీజేపీలో ముస్లిం నేతల సంఖ్య చాలా తక్కువగానే ఉన్న తరుణంలో వచ్చే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని మైనారిటీలో ఎక్కువగా ఉన్న గుంటూరువంటి ప్రాంతానికి చెందిన నేత బీజేపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications