రాబోయే ఎన్నికల్లో రెడ్ల రాజ్యం కావాలి...టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే కలకలం..వైసిపి వైపు చూపు..!
నాలుగు రోజుల క్రితం టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు పార్టీని వీడి జనసేనలో చేరారు. ఇప్పుడు మరో ఎమ్మె ల్యే ఏకంగా టిడిపిలో తన పరిస్థితి ఘోరంగా ఉందని...రెడ్ల పరిస్థితి టిడిపిలో ఘోరంగా ఉందని వ్యాఖ్యానించి కలకలం సృష్టించారు. రాబోయే ఎన్నికల్లో రెడ్ల రాజ్యం కావాలని పిలుపునిచ్చి టిడిపిలో కలకలానికి కారణమయ్యారు. రాజశేఖర రెడ్డి రెడ్ల కోసం ముఖ్యమంత్రి కాలేదని..పేదల సంక్షేమం కోసం పని చేసారని కితాబిచ్చారు. రాబోయే రోజుల్లో రెడ్ల రాజ్యం రావాలని భగవంతుడిని కోరుకుంటున్నా అంటూ ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఎన్నికల ప్రచారం లో బిజీగా ఉన్న టిడిపి అధినేతకు చేరవేసారు...
గుంటూరు జిల్లాలో మాజీ ఎంపి..అధికార పార్టీ గుంటూరు పశ్చిమ సిట్టింగ్ ఎమ్మెల్యే మోదుగుల వేణు గోపాల రెడ్డి తన వ్యాఖ్యలతో టిడిపి లో కలకలం రేపారు. పల్నాడు లో ఓ వర్గం ఏర్పాటు చేసుకున్న వన సమారాధన లో పాల్గొన్న ఆయన టిడిపి లో తన పరిస్థితి ఘోరంగా ఉందని వాపోయారు.
టిడిపిలో రెడ్ల పరిస్థితి ఘోరంగా ఉందని విశ్లేషించారు. రాబోయే ఎన్నికల్లో రెడ్ల రాజ్యం కావాలని ఆకాంక్షించారు. రాబోయే ఎన్నికల్లో రెడ్ల రాజ్యం కావాలి. గురజాలలో మనోడినే గెలిపించుకోండి. టీడీపీలో నా పరిస్థితి ఘోరంగా ఉంది.. రాజశేఖర్రెడ్డి రెడ్ల కోసం ముఖ్యమంత్రి కాలేదు. పేదల సంక్షేమం కోసం ఆయన పని చేశారు. ఆరోగ్యశ్రీ వంటి బృహత్తర కార్యక్రమం ఆయన చలవే. అందుకే రాబోయే రోజుల్లో రెడ్ల రాజ్యం రావాలని భగవంతుడిని కోరుకుంటున్నానని మోదుగుల వేణుగోపాలరెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో కలకలం సృష్టించాయి.
తెలుగుదేశంలో రెడ్ల పరిస్థితి ఘోరంగా ఉందని వ్యాఖ్మానించారు. వచ్చే ఎన్నికల్లో తాను నరసరావుపేట లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగుతానని చెబుతూ ఏ పార్టీ తరపున అనే విషయాన్ని మాత్రం దాటవేశారు. వన సమారాధన జరిగిన ప్రాంతాన్ని ప్రస్తావిస్తూ ఈ నియోజకవర్గం (గురజాల) నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మన సామాజిక వర్గం అభ్యర్థినే (పరోక్షంగా వైసీపీ అభ్యర్థి కాసు మహేష్రెడ్డి) గెలిపించుకోవాల్సిందిగా గీతోపదేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో నర్సరావుపేట ఎంపీగా పోటీ చేస్తానని చెబుతున్న మోదుగుల వైసిపి నుండి బరిలోకి దిగుతారనే అంచనాలు వినిపిస్తున్నాయి. అక్కడ ప్రస్తుతం కృష్ణ దేవరాయులు నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వక కర్తగా ఉన్నారు. అయితే, మోదుగుల వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన వైసిపి చేరటం ఖాయంగా కనిపిస్తోంది. మరి..మోదుగుల చేసిన ఈ వ్యాఖ్యల పై టిడిపి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి...