విద్యుత్ షాక్: ఆరుగురు మృతి.. ఎక్కడ అంటే
గుంటూరు జిల్లాలో విషాదం జరిగింది. రొయ్యల చెరువు వద్ద విద్యుత్ షాక్ కొట్టింది. దీంతో ఆరుగురు చనిపోయారు. రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో ఈ విషాద ఘటన జరిగింది. గురువారం అర్ధరాత్రి రొయ్యల చెరువు దగ్గర ఒడిశా వాసులు కాపలాగా పనిచేస్తున్నారు. అర్ధరాత్రి చెరువు గట్టుపై నిద్రిస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు తెగిపడి ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
వెంటనే స్థానికుల పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతుల వివరాలను వెల్లడించారు. విద్యుత్ షాక్తో ఆరుగురు చనిపోవడం బాధ కలిగిస్తోంది. తమ వారు చనిపోయారని ఒడిశా వాసులు బోరున విలపిస్తున్నారు. పొట్ట కూటీ కోసం ఇక్కడికీ వస్తే.. ఇలా జరిగిందని అంటున్నారు. ఉపాధి కోసం వస్తే కానరాని లోకాలకు వెళ్లారని గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతులను మ్మూర్తి, కిరణ్, మనోజ్, మహేంద్ర, నవీన్, పండబోగా గుర్తించారు.

రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో ఆరుగురు వలస కూలీలు సజీవ దహనం అయ్యారు. ఒడిశాకు చెందిన ఆరుగురు వ్యక్తులు లంకెవాని దిబ్బ వద్ద ఉన్న రొయ్యల చెరువు కాపలాకు కుదిరారు. నిన్న రాత్రి చెరువు పక్కనే ఉన్న రేకుల షెడ్డులో నిద్రపోయా రు. ఇదే సమయంలో కరెంటు తీగలు రేకుల షెడ్కి తగిలి మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. మంటల్లో ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. వారి మృతదేహాలు గుర్తించలేని విధంగా కాలిపోయాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తుండగా.. ఈ దుర్ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణం కాదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అధికారులు ఆ ప్రాంతానికి మీడియాను అనుమతించడం లేదు. విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు తెగిపోయాయని విశ్వసనీయంగా తెలిసింది. ఎవరో కావాలని చేసినట్టు తెలియరాలేదు అని చెప్పారు. దీనికి సంబంధించి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఎంక్వైరీలో నిజ నిజాలు తెలిసే అవకాశం ఉంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications