హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2493 మందికి కరోనా.. 15 మంది మృతి...

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 2500 వరకు కేసులు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. మరణాలు కూడా అదేరీతిన తగ్గుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,493 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 3,308 మంది కోలుకున్నారు. 15 మంది ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు 5,80,844కు పెరిగాయి. 5,44,294 మంది కోలుకున్నారు. ఇంకా 33,254 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు 3,296 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 94,189 శ్యాంపిళ్లను వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది.

2493 people infected coronavirus in telangana

వేసవిలోనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. అక్టోబర్‌లో థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. సరయిన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు జనానికి ఇబ్బందులు తప్పవు.

English summary
2493 people infected coronavirus in telangana state and 15 people dead who infected virus
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X