హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా అప్‌డేట్... తెలంగాణలో కొత్తగా 397 కేసులు.. మరో ఇద్దరు మృతి...

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కొత్తగా 397 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. మరో 496 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం (డిసెంబర్ 28) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

కరోనా కొత్త స్ట్రెయిన్... తెలంగాణలో బయటపడ్డ తొలి కేసు... జీనోమ్ సీక్వెన్స్‌లో వెల్లడి...కరోనా కొత్త స్ట్రెయిన్... తెలంగాణలో బయటపడ్డ తొలి కేసు... జీనోమ్ సీక్వెన్స్‌లో వెల్లడి...

తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,85,465కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1535కి చేరింది. ప్రస్తుతం 5998 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. 3838 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 627 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,77,931కి చేరింది.

 397 new coronavirus cases and 4 deaths reported from telangana

గడిచిన 24గంటల్లో మొత్తం 42,737 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 67,93,691కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 1,82,527 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.5శాతం ఉండగా... తెలంగాణలో 0.53శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 95.9 శాతం ఉండగా తెలంగాణలో 97.36శాతం ఉన్నట్లు తెలిపారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 92 కేసులు ఉన్నాయి.

వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడండి

మరోవైపు యూకెలో వెలుగుచూసిన కొత్త కోవిడ్ 19 స్ట్రెయిన్‌కు సంబంధించిన కేసు తెలంగాణలోనూ బయటపడింది. డిసెంబర్ 10న యూకె నుంచి వరంగల్ అర్బన్ జిల్లాకు వచ్చిన ఓ వ్యక్తి(49)కి కొత్త రకం కరోనా వైరస్ సోకినట్లుగా నిర్దారణ అయింది. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) ఈ విషయాన్ని ప్రభుత్వానికి వెల్లడించింది. సీసీఎంబీలో అతని శాంపిల్స్‌ నుంచి వైరస్ జీనోమ్‌ను విశ్లేషించగా ఈ విషయం నిర్దారణ అయింది. అతని తల్లి(71)కి కూడా కరోనా పాజిటివ్‌గా తేలగా... ఆమెకు సోకింది కొత్త వైరసా లేక పాత వైరసా అన్నది ఇంకా నిర్దారించాల్సి ఉంది. ఇందుకోసం ఆమె శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ నిమిత్తం సీసీఎంబీ ల్యాబ్‌కు పంపించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

కాగా,డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకూ తెలంగాణకు మొత్తం 1216 మంది ప్రయాణికులు వచ్చినట్లు గుర్తించామని రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. వీరిలో ఇప్పటికే 1060 మందిని ట్రాక్ చేసినట్లు తెలిపారు. మరో 58 మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోగా... ఆరుగురు విదేశాలకు వెళ్లిపోయినట్లు గుర్తించామన్నారు. మిగిలిన 996 మందికి కరోనా నెగటివ్‌గా నిర్దారణ అయిందని తెలిపారు. పాజిటివ్‌గా తేలిన 21 మదిలో మరో 9 మంది రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందన్నారు.

English summary
397 new coronavirus cases were reported in Telangana from last 24 hours,more 4 patients were died. Total cases number of covid 19 cases reached to 2,85,465 and total death toll reached to 1535. While 42,737 samples were put to test, results
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X