Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Hyderabad: హైదరాబాద్‍లో దారుణం.. ట్రాఫిక్ చలాన్లు చెల్లించలేక కార్మికుడి ఆత్మహత్య..!

ట్రాఫిక్ చలాన్లు చెల్లించలేక సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కార్మికుడు పురుగుమందు తాగి జీవితాన్ని చాలించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే అతను వ్యక్తిగత కారణాల వల్లే కూలీ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. చింతల్ బస్తీ ప్రాంతంలోని నీలం రాజశేఖర్ రెడ్డి వద్ద 52 ఏళ్ల ఎ ఎల్లయ్య, అతని భార్య మల్లమ్మ నివాసం ఉంటున్నారు.

ఎల్లయ్య రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతుండగా, అతని భార్య అదే ప్రాంతంలోని సాయిబాబా ఆలయంలో హెల్పర్‌గా పనిచేస్తోంది. ఎల్లయ్యకు బైక్ ఉంది. ఆ వాహనంపై అనేక ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మీర్చౌక్ పోలీసులు అతని వాహనాన్ని సీజ్ చేశారు. బండి ఇవ్వాలంటే
పదివేలు చెల్లించాలని కోరారు.

A Man Commited Suicide Unable to pay Traffic Challans in hyderabad

అతని వాహనాన్ని జప్తు చేసినప్పటి నుంచి అతను మానసికంగా ఆవేదనగా ఉన్నట్లు తెలిసింది. భారీ ట్రాఫిక్‌ చలాన్‌ల భారాన్ని తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ పేద ప్రజల కష్టాలను పరిశీలించాలని సూసైడ్‌ నోట్‌ లో పేర్కొన్నాడు. ట్రాఫిక్ చలాన్ల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారని మృతుడి భార్య మల్లమ్మ చెప్పింది.

దీనిపై సైదాబాద్ పోలీసులను సంప్రదించగా ఎల్లయ్య ఆత్మహత్య వెనుక ట్రాఫిక్ చలాన్‌ల కారణాన్ని ఖండించారు. కుటుంబ కలహాల కారణంగా అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+