విషాదం: గెస్ట్హౌస్లో అనుమానాస్పదస్థితిలో కాగ్నిజెంట్ టెక్కీ మృతి
హైదరాబాద్: నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ మౌలాలి హెచ్బీ కాలనీకి చెందిన శ్రీకాంత్(49) బెంగళూరులోని కాగ్నజెంట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు.
2007లో వివాహమైన మూడు నెలలకే అతను మధుమేహంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న భార్య అతడిని వదిలి వెళ్లిపోయింది. అప్పట్నుంచి ఒంటరిగానే ఉంటున్న శ్రీకాంత్ మద్యానికి బానిసయ్యాడు. అక్టోబర్ 3న నగరానికి వచ్చిన శ్రీకాంత్ డైమండ్ పాయింట్ చౌరస్తాలోని అతిథి గెస్ట్ హౌస్లో ఉంటున్నాడు. కాగా, ఇతనికి బంధువైన శ్రీనివాస్ భోజనం తెస్తుంటారు. రోజులాగే శ్రీనివాస్ శనివారం మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చాడు.

ఎంత తట్టినా శ్రీకాంత్ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి నిర్వాహకులు విషయం చెప్పాడు. వారు వచ్చి తలుపులు తెరిచి చూసేసరికి శ్రీకాంత్ అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. 108 సిబ్బంది శ్రీకాంత్ను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. శ్రీకాంత్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతని తమ్ముడు నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
విద్యుత్ షాక్తో మహిళ మృతి
Recommended Video
విద్యుత్ షాక్ తో ఓ మహిళా రైతు మృతి చెందింది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం మహ్మద్నగర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవల భూదేవ్వ(48) రోజు మాదిరిగానే శనివారం పొలానికి నీరు పారించేందుకు వెళ్లింది. సాంయత్రమైన తిరిగి రాకపోయేసరికి కుమారుడు వెళ్లి చూడగా.. బోరు భావి దగ్గర విగతజీవిగా పడివుంది భూదేవ్వ. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మోటారు ఆన్ చేసే సమయంలో విద్యుత్ షాక్ తగిలి మహిళా రైతు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
-
ఆ జిల్లాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చిన ఐఎండీ! -
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి..












Click it and Unblock the Notifications