దారుణం: భర్తను హత్య చేసి ఇంట్లోనే పూడ్చి పెట్టిన మహిళ, పెద్ద నాటకమే ఆడింది!
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టింది. ఘటనపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నౌసిన్ బేగం, గగన్ అగర్వాల్(38) భార్యభర్తలు.
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహారా రోడ్డులోని వివేకానందనగర్ కాలనీలో గగన్ నివాసం ఉంటున్నారు. రెండేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన గగన్.. గత జులైలో పాతబస్తీకి చెందిన నౌసిన్ బేగం(38)ను రెండో వివాహం చేసుకున్నాడు.

కాగా, ఫిబ్రవరి 8వ తేదీ నుంచి గగన్ కనిపించకుండా పోయారు. ఈ క్రమంలో తన భర్త కనిపించడం లేదంటూ నౌసిన్ ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గగన్ సోదరుడు కూడా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తున్నందున ఎల్బీనగర్ పోలీసులు కేసును అక్కడికి బదలీ చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, నౌసిన్ బేగం తన ఇంటికి తాళం వేసి పాతబస్తీలోని పుట్టింటికి వెళ్లిపోయింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు బుధవారం ఉదయం నౌసిన్ను విచారించారు. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు.
పోలీసుల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన నౌసిన్ అసలు నిజం ఒప్పుకుంది. తన భర్తను తానే హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లు పోలీసుల ముందు అంగీకరించింది. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు... అక్కడ్నుంచి గగన్ మృతదేహాన్ని వెలికి తీశారు. నౌసిన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భర్తను హత్య చేసిన ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం సృష్టించింది.
-
రోడ్డున పడుతున్న గిగ్ వర్కర్లు, ప్రత్యామ్నాయంగా..!! -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications