Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొత్త ఏడాది పేరుతో కుమ్మేశారు -తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు -ఎంతంటే..

కరోనా విలయ కాలంలో దాదాపు అన్నీ రంగాలూ స్తంభించిపోయినా, మద్యం అమ్మకాలు మాత్రమే ప్రభుత్వాలకు ఏకైక ఆదాయమార్గంగా ఉంటూ వచ్చాయి. అన్ లాక్ ప్రక్రియలో ముందుగా తెరుచుకున్నవి కూడా వైన్ షాపులేనని తెలిసిందే. గతేడాది కరోనా కారణంగా న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేనప్పటికీ జనం ఇళ్లలోనే కూర్చొని మందు కుమ్మేశారు. తెలంగాణలోనైతే మద్యం అమ్మకాలు కొత్త రికార్డులను తాకింది..

2021 కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతూపే తెలంగా రాష్ట్రం మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డులు సృష్టించింది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే వందల కోట్ల లిక్కర్ బిజినెస్ నడిచింది. డిసెంబర్‌ 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల వ్యవధిలోనే దాదాపు రూ.758.76 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. రాష్ట్ర అబ్కారీశాఖ ఈ మేరకు ఒక ప్రకటనలో వెల్లడించింది.

amid new year celebrations Liquor sales hit a new high in telangana

న్యూ ఇయర్ సందర్భంగా పబ్లిక్ ఈవెంట్లకు అనుమతి లేనప్పటికీ, వైన్స్, బార్లకు ఒక గంట సమయం అదనంగా అనుమతించారు. దీంతో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 వరకూ అమ్మకాలు కొనసాగాయి. గతేడాది పోలిస్తే.. ఈ నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్లు అధికంగా ఆదాయం వచ్చినట్టు అబ్కారీ శాఖ పేర్కొంది.

హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లోనే రూ.300 కోట్ల విక్రయాలు జరిగాయి. మొత్తంగా 8.61 కోట్ల లిక్కర్ కేసులు, 6.62 కోట్ల బీర్ కేసుల అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో, సరిహద్దు జిల్లాల్లో మద్యం అమ్మకాల జోరు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+