వదళ బొమ్మాళీ: మరో వివాదంలో మేయర్ గద్వాల..
గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మిని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇచ్చిన తొలి ఇంటర్వ్యూ కాంట్రవర్సీ అయిన సంగతి తెలిసిందే. ఈ ఐదేళ్లు హైదరాబాద్లో వర్షాలు పడొద్దని కామెంట్ చేయడంతో రాజకీయ ప్రకంపనాలు చెలరేగాయి. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తనను కలువడానికి వచ్చినవారికి ఓటు వేయాలని కోరారు. దీంతో మరో వివాదం రాజుకుంది.
జీహెచ్ఎంసీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన వారికి మేయర్ టీఆర్ఎస్ కరపత్రాలు పంచారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి తన ఛాంబర్లో టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేయడం ఎన్నికల కోడ్కు విరుద్దమని ప్రతిపక్షాలు అంటున్నాయి.

ఇటీవల మేయర్ను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చారు. ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని వారికి మేయర్ కరపత్రాలు పంచారు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ అయ్యింది. మేయర్ గద్వాల విజయలక్ష్మిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘననే అని అంటున్నాయి. ఇందుకు సంబంధించి మేయర్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications