గుడ్ న్యూస్: జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సీజేఐ ఓకే, హర్షం.. కేటీఆర్ థాంక్స్
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తన పదవీ ముగిసే చివరి రోజు కీలక తీర్పు వెలువరించారు. దాదాపు 8 వేల మంది జర్నలిస్టులను ఉద్దేశించిన హౌసింగ్ సొసైటీకి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఈ అంశంపై జర్నలిస్టులు సుదీర్ఘకాలంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసులో విచారణ జరిగింది. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడదని పేర్కొన్నారు.

12 ఏళ్ల కింద..
జర్నలిస్టులకు 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ల గురించి మాట్లాడటం లేదు.. ఓ చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బందిపడాలని ఆయన అడిగారు. రూ. 8,000 నుంచి రూ. 50 వేల జీతం తీసుకునే సుమారు 8 వేల మంది జర్నలిస్టులు అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నాం మని తెలిపారు. జర్నలిస్టులకు భూమి కేటాయించారని.. కానీ అభివృద్ధి చేయలేదన్నారు. వారు స్థలం కోసం రూ. 1.33 కోట్లు డిపాజిట్ చేశారని గుర్తుచేశారు. జర్నలిస్టుల స్థలాన్ని తిరిగి వారు స్వాధీనం చేసుకోడానికి అనుమతిస్తున్నాం అని తెలిపారు. అక్కడ వారు నిర్మాణాలు కూడా చేసుకోవచ్చున్నారు.ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును మరో బెంచ్ ముందు లిస్టు చేయాలని కోరారు.

జర్నలిస్టుల హర్షం
జస్టిస్ ఎన్వీ రమణ తీర్పుపై పాత్రికేయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ తీర్పుపై స్పందించారు. తెలంగాణ జర్నలిస్టు సొసైటీ ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి సుదీర్ఘకాలంగా విచారణలో ఉన్న ఈ కేసును పరిష్కరించినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ధన్యవాదాలు తెలిపారు. ఈ తీర్పు వల్ల పాత్రికేయ మిత్రులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు వీలు కలుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.

థాంక్స్
తెలంగాణ జర్నలిస్టుల నివాసాల కోసం సుప్రీంకోర్టులో కేసు త్వరగా పరిష్కారం అయ్యేందుకు ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా తీసుకున్న సీఎం కేసీఆర్కు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ టీయూడబ్ల్యూజే అధ్యక్షులు అల్లం నారాయణ, సలహాదారులు క్రాంతి కిరణ్, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ తెమ్జూ సయ్యద్ ఇస్మాయిల్ ,కార్యదర్శి రమణ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో గల ధర్మాసనానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టుల కుటుంబాలకు ఇది తెలంగాణ ప్రభుత్వం కృషి ద్వారా అందిన తీపి కబురు అని అల్లం నారాయణ అన్నారు. జర్నలిస్టుల ఇళ్లస్థలాల కేటాయింపు విషయంలో కృషి చేసి, చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications