ఒక్క ఛాన్స్ మిస్ యూజ్.. జనంలో వ్యతిరేకత, జగన్పై చండ్ర నిప్పులు
ఏపీ సీఎం జగన్పై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మరోసారి ఫైరయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. మూడేళ్లలోనే జనాలకు చుక్కలు చూపించారని ఆయన అన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి చంద్రబాబు నివాళులు అర్పించారు. తర్వాత సీనియర్ నేతలతో ఆన్లైన్లో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. వారికి జనం ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయిందని.. దానిని వారు సద్వినియోగం చేసుకోలేదని చెప్పారు.
సీఎం జగన్ పై మరోసారి చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్కి ఇచ్చిన ఒక్క ఛాన్సే.. లాస్ట్ ఛాన్స్ అని చంద్రబాబు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని సీఎం రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగిన.. జరుగుతోన్న పనిని జనం గమనిస్తున్నారని తెలిపారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా బుద్ది చెబుతారని తెలిపారు. మైనింగ్, ఇసుకాసురులకు ప్రభుత్వం దన్నుగా నిలుస్తోందని వివరించారు.

సీఎం జగన్ తన తల్లిని, చెల్లిని పక్క రాష్ట్రానికి తరిమేశారని చంద్రబాబు ఆరోపించారు. మరో చెల్లి తన తండ్రి హత్య కేసు పరిష్కారానికి పోరాటం చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుని ఉద్దేశించి వాపోయారు. వైసీపీ నేతల రౌడీయిజం, సెటిల్ మెంట్లపై పోరాడాలని తమ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రజల కోసం పోరాటం తప్పదని చెప్పారు. వారి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తేల్చిచెప్పారు.
జగన్ దగ్గర డబ్బు, అధికారం ఉంటే టీడీపీకి ప్రజాబలం ఉందన్నారు. ఆ బలంతోనే వారికి బుద్ది చెబుతామని పేర్కొన్నారు. అలాగే పార్టీలో నేతల గురించి ఒకింత గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. పని చేయని నాయకులను పార్టీ భరించాల్సిన అవసరం లేదని నేతలకు హెచ్చరించారు. త్వరలో ఆన్ లైన్ సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామని తెలిపారు. టీడీపీ 40 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు, ఎన్టీఆర్ వంద జయంతి, మహానాడుకు ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications