చాగంటి మానవ జాతికి దోరికిన మణిపూస : సీఎం కేసీఆర్
ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటీ కోటేశ్వర్రావు ప్రవచనాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు కురిపించారు. ఆయన గొప్ప ప్రవచనకర్త అంటూ వ్యాఖ్యానించారు. చాగంటి మానవ జాతికి దొరికిన మణిపూస అంటూ పొగడ్తలతో ముంచెత్తారు సీఎం కేసీఆర్, ఎన్టీఆర్ స్టేడియంలో చాగంటి కోటేశ్వరరావు భాగవత సప్తాహం ముగింపు కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చాగంటిని కేసీఆర్ శాలువాతో సన్మానించారు.
ఈనేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఆయన ప్రవచనాలను గుర్తు చేసిన కేసిఆర్ తనకు కూడ భాగవత సప్తాహం వినాలని కోరిక ఉందని చెప్పారు. భగవంతుని గురించి చదివినా, విన్నా గొప్ప పుణ్యం లభిస్తుందని చెప్పారు.. గజేంద్రమోక్షం లాంటి ఘట్టాలు చాలా సందర్భాల్లో కనిపిస్తాయని అన్నారు..ఇక భగవంతుని కరుణ మనకు కలగాలంటే లీనమై ప్రవచనాలు వినాలని చెప్పారు.
చాగంటిని గౌరవిస్తే మనకు మనం గౌరవించుకున్నట్టేనని వ్యాఖ్యానించారు.. ఆధ్యాత్మికత అలవరచుకుంటే శాంతి, సౌభాగ్యం లభిస్తాయని అన్నారు... రోజురోజుకు మానవ ప్రవృత్తి మారుతోందని, ఎక్కడకెళ్లినా రాని క్రమశిక్షణ గుడికెళ్తే వస్తుందని' కేసీఆర్ అన్నారు.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించబడుతున్న భాగవత సప్తాహం చివరి రోజున హాజరై వారిని సత్కరించిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు దంపతులు. pic.twitter.com/42XjOfa7AD
— Telangana CMO (@TelanganaCMO) December 20, 2019