పొంగులేటికి రాజ్యసభ ఆఫర్.. ఇంట్రెస్ట్ చూపని మాజీ ఎంపీ.. కారణమిదే..?
రాజ్యసభ కోసం టీఆర్ఎస్లో ఆశావాహుల సంఖ్య పెరుగుతుంది. 3 స్థానాల కోసం జోరుగానే లాబీయింగ్ జరుగుతుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి ఆఫర్ వచ్చినట్టు తెలిసింది. రాజ్యసభకు పంపించడానికి కేసీఆర్ సుముఖంగా ఉన్నారట. కానీ పొంగులేటి మాత్రం నో అంటున్నట్టు తెలిసింది. ఇందుకు తగిన కారణం కూడా ఉంది. పిలిచి ఆఫర్ ఇచ్చిన ఆయన ఇంట్రెస్ట్గా లేరట.

రెండెళ్లే అవకాశం..
బండ ప్రకాష్ రాజీనామాతో ఒక స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఆ స్థానాన్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వాలని కేసీఆర్ అనుకుంటున్నారట. ఈ సీటుకు రెండేళ్ల పదవీకాలమే ఉంది. దీంతో పొంగులేటి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. రాజ్యసభకు తొలి నుంచీ ఓసీ సామాజిక వర్గాల నుంచి అవకాశం ఇస్తున్నారు.
పొంగులేటితోపాట నమస్తే తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్, పార్టీ మాజీ కోశాధికారి డి.దామోదర్ రావు, హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథిరెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కవిత పేరు కూడా వినిపిస్తోంది.

ఇదీ లెక్క
ఇక బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, హైదరాబాద్కు చెందిన మున్నూరు కాపు నేత పీఎల్ శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ మంద జగన్నాథం, ఎస్టీల నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరితోపాటు ప్రకాశ్ రాజ్ పేరు కూడా వినిపించింది. ఆయనకు దాదాపు కన్పామ్ అనే వార్తలు వచ్చాయి. కానీ వీరందరిలో కేసీఆర్ ఎవరి పేర్లను ఫైనలైజ్ చేయనున్నారో చూడాలీ మరీ.

ప్రకాశ్ రాజీనామా
రాజ్యసభ మూడు స్థానాలకు ఎన్నిక జరగనుంది. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ రాజీనామాతో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంటే.. డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీ కాలం జూన్ 21వ తేదీతో పూర్తవనుంది. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయిన రోజు.. మరో రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాల భర్తీ కోసం ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే.