అందుకే యాసంగి కిరికిరి షురూ.. కేసీఆర్పై షర్మిల విమర్శలు
సీఎం కేసీఆర్పై వైఎస్ షర్మిల మరోసారి నిప్పలు చెరిగారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రైతులు చనిపోతున్నా తమకు రాజకీయాలే ముఖ్యమని రాష్ట్రంతోపాటు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని షర్మిల మండిపడ్డారు. యాసంగి వడ్లు కొనబోమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇవ్వడం పట్ల ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు. రాష్ట్రంలో చివరి గింజ వరకూ కొంటామని మొన్నటివరకు చెప్పిన కేసీఆర్, కేంద్రంతో పంచాయితీ మొదలు కాగానే యాసంగి కిరికిరి షురూ చేశారని పేర్కొన్నారు.

కేసీఆర్ నాటకాలు..
కేంద్రం వడ్లు కొనడం లేదని చెప్పి, కేంద్రంపై నెపం మోపి నాటకాలు ఆడుతున్నారని ఆమె విమర్శించారు. ఢిల్లీ కోటలు బద్దలు కొడతాం... మోడీని తరిమేస్తాం అని చెప్పే కేసీఆర్.. కేంద్రం నుంచి వడ్లు కొనిపించడం చేతకాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పేవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలేనని, కేసీఆర్కు దమ్ముంటే కేంద్రం మెడలు వంచి వడ్లు కొనిపించాలని సవాల్ విసిరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండ్రోజుల వ్యవధిలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం పట్ల షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

రుణమాఫీ ఏదీ..?
రైతు ఆత్మహత్యలు కేసీఆర్కు పట్టడం లేదని, రైతు చనిపోతున్నా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సర్కారు హామీ ఇచ్చిన రుణమాఫీ పత్తా లేకుండా పోయిందన్నారు. మంత్రులు తిరిగి పంటలు పరిశీలించారే తప్ప ఇప్పటివరకూ నష్ట పరిహారం ఇవ్వలేదన్నారు. కేసీఆర్కు భజన చేస్తున్న మంత్రులు.. నష్టపరిహారం పట్ల కేసీఆర్కు అడగడం మాత్రం చేతకావడం లేదన్నారు. బ్యాంకులు లోన్లు ఇవ్వక, ఆదుకునే నాయకుడు లేక రైతులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారన్నారు.

ఇక బంగారు దేశం
ఏ దిక్కూ లేక దేవుడే దిక్కూ అంటూ రైతులు బలవన్మరణానికి పాల్పడుతుంటే.. స్పందించాల్సిన ప్రభుత్వం.. చనిపోతే తమకేంటనే ధోరణిలో ఉందన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణ చేశామని, ఇక బంగారు భారతదేశం చేస్తామని రైతు శవాల మీది నుంచే కేసీఆర్ దొర దేశం బయలుదేరుతున్నాడని ఎద్దేవా చేశారు. ఇంట గెలవనోడు రచ్చ గెలుస్తాడా? అని ఆమె మండిపడ్డారు. కేసీఆర్ది రైతు సంక్షేమ ప్రభుత్వమే అయితే ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ తప్పుడు హామీలతో రైతులను మోసం చేస్తున్నారని, అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications