మత రాజకీయాలపై కేటీఆర్ కస్సు బుస్సు.. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదని వెల్లడి
హైదరాబాద్ : మత రాజకీయాలు సరికాదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశంలో ప్రత్యేక పరిస్థితి నెలకొందని .. ఇలాంటి సమయంలో మతం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. శనివారం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ వికాస సమితి మహాసభలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కుల, మత రాజకీయాల గురించి ప్రసంగించారు. తెలంగాణలో మాత్రం అందుకు పరిస్థితులు భిన్నమని తెలిపారు.
ఒక మతాన్ని వ్యతిరేకించడం సరికాదని అభిప్రాయపడ్డారు కేటీఆర్. అలాగే ఒక వర్గానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా మంచి పద్ధితి కాదన్నారు. జాతిపిత మహాత్మాగాంధీని కూడా గౌరవించుకోలేని స్థితికి వచ్చామని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కులా,మతాలకతీతంగా జీవనం కొనసాగుతుందని ప్రశంసించారు. ఒకరు తనతో ఉంటే దేశభక్తుడి .. లేకుంటే ద్రోహివి అనే పరిస్థితి సరికాదన్నారు.

తెలంగాణ వికాస సమతి మంచి ఆలోచనతో ఏర్పడిందని కొనియాడారు. ఇది ఇలాగే కొనాసాగాలని ఆయన ఆకాంక్షించారు. నాథురామ్ గాడ్సే దేశభక్తుడిని సాద్వీ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తాను ఖండించిట్టు గుర్తుచేశారు. కానీ సాద్వీ వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తూ కొందరు ట్వీట్ చేయడం బాధ కలిగించిందన్నారు. ఇలా కుల,మతాల పేరుతో విభజించుకుంటూ పోవడం సరికాదన్నారు. ఒకరి అసమంజస వాదనను తెరపైకి తీసుకొచ్చి .. మిగతా వారు ఏకీభవించాలని కోరడం మంచి పద్దతి కాదన్నారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications