ఇది తల్లా.. రాక్షసా..? పెళ్లికి ముందే కూతురితో కాపురం చేయించింది..!!
సంగారెడ్డి/హైదరాబాద్ : సమాజం ప్రపంచీకరణ వైపు పరుగులు తీస్తున్నా సగటు మహిళకు జరగాల్సిన అన్యాయం మాత్రం దేశంలో ఏదో ఓ మూలన క్రమం తప్పకుండా జరిగిపోతోంది. సభ్య సమాజం తల వంచుకునే ఘటన తెలంగాణలో చోజుచేసుకుంది. ఆమెకు చదువుకుని మంచి స్థాయిలో స్ధిరపడాలని కోరిక. తల్లిదండ్రులకు మాత్రం ఆమెను ఓ అయ్య చేతిలో పెట్టి బాధ్యత వదిలించుకుందామన్న తాపత్రయం. పదహారేళ్ల వయసులోనే ఆమెను ఓ రెండో పెళ్లివాడికిచ్చి పెళ్లిచేయాలనుకుంటే కుదరలేదని అతనితోనే కాపురం చేయించి ఆమె గొంతు కోశారు.
అంతేకాదు తాను చదువుకుంటాను, తనకు పెళ్లి వద్దు అంటూ ఆ అభాగ్యురాలి వేదనను ఎవరూ పట్టించుకోలేదు. పదో తరగతి పూర్తయిన విద్యార్థినిని ఇంటర్లో చేర్పించాల్సిన ఓ బాధ్యత గల తండ్రి మూర్ఖత్వం.. పెళ్లి చేయకూడని వయస్సులో బలవంతంగా వివాహం జరిపించాలన్న తల్లి నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం వెరసి ఆ అమాయకురాలిని గర్భవతిని చేశాయి. ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేశాయి. హృదయ విదారకమైన ఈ ఘటన సంగారెడ్దిలో చోటుచేసుకుంది.

సంగారెడ్డికి చెందిన పదహారేళ్ల బాలికకు మూడు నెలల క్రితం తల్లిదండ్రులు నిశ్చితార్ధం చేశారు. పెళ్లి ఇష్టం లేదని ఆపించాలని బాలిక తెలిసిన వారి సాయంతో మహిళా, శిషు సంక్షేమ అధికారులకు విన్నవించింది. బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లి చేయవద్దని హెచ్చరించారు. అయినా అధికారుల హెచ్చరికను లెక్క చేయని ఆ తల్లిదండ్రులు బిడ్డకు పెళ్లయిన వ్యక్తితో నిశ్చితార్థం జరిపి కాపురం చేయించారు.
తల్లిదండ్రుల నిర్లక్ష్యం అధికారుల అలసత్వంతో అమాయకురాలిని గర్భవతిని చేశాయి. బాలిక జివితం చిన్నా భిన్నం చేసింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు అబార్షన్ చేయించారు. బాధ్యుడైన వ్యక్తితో పాటు బాలిక కుటుంబానికి చెందిన నలుగురిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్టు చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications