రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఎన్నికపై హైకోర్టులో పిటిషన్ .. చట్టాన్ని ఉల్లంఘించారన్న టీఆర్ఎస్ అభ్యర్థి
హైదరాబాద్ : ఎన్నికలో అక్రమాలకు పాల్పడి .. ఓటర్లను ప్రభావితం చేశారనే అభియోగాలతో రాజాసింగ్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ హైకోర్టును ఆశ్రయించారు. గత డిసెంబర్ 7న జరిగిన ఎన్నికల్లో రాజాసింగ్ .. అక్రమాలకు పాల్పడ్డారని తన పిటిషన్ లో పేర్కొన్నారు. దాంతోపాటు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ఓటర్లను ప్రభావితం చేశారని అందులో ప్రస్తావించారు.

యధేచ్చగా చట్టం ఉల్లంఘన
అసెంబ్లీ ఎన్నికకు నామినేషన్ వేసినప్పటి నుంచి ఫలితాలు వచ్చే వరకు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951ను యధేచ్చగా ఉల్లంఘించారని కోర్టు ద్రుష్టికి తీసుకొచ్చారు రాథోడ్. ఈ క్రమంలో రాజాసింగ్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని ధర్మసనానికి విన్నవించారు. ఈ అంశంపై భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం, గోషామహల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, గోషామహల్ లో పోటీచేసిన అభ్యర్థులను ప్రతివాదులుగా చేర్చాలని పేర్కొన్నారు. ప్రేమ్ సింగ్ రాథోడ్ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నది.












Click it and Unblock the Notifications