టీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్..!! నిలిచిపోయిన విలీన ప్రక్రియ, నోటీసు ఇచ్చిన ఈయూ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్ మోగబోతోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఇతర డిమాండ్లను పరిష్కరించకపోవడంతో కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి .. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ సమ్మె నోటీసు ఇచ్చింది. తాజాగా ఎంప్లాయీస్ యూనియన్ కూడా సమ్మె నోటీసు అందజేయడంతో .. సమ్మె తప్పదని కార్మిక సంఘ నేతలు అంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఇందుకు ప్రభుత్వం కూడా సముఖుత వ్యక్తం చేసింది. కానీ విలీన ప్రక్రియ అడుగులు మాత్రం ముందుకు పడటం లేదు. దీంతో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు జారీచేసింది. ఈ క్రమంలో ఇవాళ ఎంప్లాయీస్ యూనియన్ కూడా సమ్మె నోటీసు ఇచ్చింది.

బస్ భవన్లో ఆర్టీసీ మేనేజ్మెంట్కు యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి సమ్మె నోటీసు ఇచ్చారు. ఆర్టీసీ పరిరక్షణకు సంస్థ కృషి చేయాలని ఆయన కోరారు. ఆర్టీసీ విలీనానికి 2013 అక్టోబర్లోనే జీవో విడుదలైందని గుర్తుచేశారు. కానీ విలీన ప్రక్రియ మాత్రం జరగడం లేదన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి .. కానీ విలీన ప్రక్రియ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారిందని విమర్శించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications