ట్రాన్స్పోర్టులో పేలుడు పదార్థాలు.. పోలీసులకు సమాచారం.. ఏం జరిగిందంటే..
హైదరాబాద్లో పేలుడు పదార్థాలు కలకలం రేపాయిం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గల వనస్థలిపురంలో పేలుడు పదార్థాలు కనిపించాయి. వనస్థలిపురం నవతా ట్రాన్స్పోర్టులో ఇటీవల వచ్చిన ఓ కొరియర్ పార్సెల్లో పేలుడు పదార్థాలు ఉన్నాయి. 8 కార్టన్లలో పేలుడు పదార్థాలు కనిపించాయి. ఇవీ చిలకలూరిపేట నుంచి పుణెకు పార్సిల్ చేయబడ్డాయి. మార్చి 15వ తేదీన హైదరాబాద్కు కొరియర్ చేరుకోగా ట్రాన్స్పోర్టు సిబ్బంది సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం వాటిని పరిశీలించారు.
8 కార్టన్లలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ పేలుడు పదార్థాలు సినిమాల్లో వాడే బాంబులుగా నిర్ధారించారు. మొత్తం 8 కార్టన్లలో సుమారు 100 బాంబులు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే పేలుడు పదార్ధాలు తరలింపుకు లైసెన్స్ ఉందా? ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? ఎవరి పేరుపై ఉన్నాయి? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కానీ ఈ ఘటన మాత్రం కలకలం రేపింది. నయం ఆ పేలుడు పదార్థాలు అలానే ఉన్నాయి. ఏ మాత్రం పేలలే.. లేదంటే మరోలా ఉండేది. అయితే సినిమాల్లో వాడేవి అని చెప్పడంతో ఆ స్థాయిలో నష్టం ఉండదని మరికొందరు అంటున్నారు.
-
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
"అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏమవుతుంది..?" -
ఆ జరిమానా అంతా నేనే కడతా: పీసీబీకి ఆటగాడి బంపరాఫర్! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!












Click it and Unblock the Notifications