Jublihils Peddammathalli: పెద్దమ్మతల్లి ఆలయానికి ఫుడ్ లైసెన్స్.. త్వరలో అందజేత..
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మతల్లి ఆలయానికి ఫుడ్ లైసెన్స్ వచ్చింది. ఫుడ్సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం జీహెచ్ఎంసీ జారీ చేసిన ఫుడ్ లైసెన్స్ను పెద్దమ్మ దేవాలయానికి త్వరలో అందజేయనున్నారు.
బల్కంపేట ఎల్లమ్మ
హైదరాబాద్ లోని ప్రాఖ్యత దేవాలయాల్లో భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించేందుకు.. ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ అధికారి సుదర్శన్రెడ్డి, జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బాలాజీ రాజు ఫుడ్ ఇన్స్పెక్టర్లతో కలిసి చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ఇప్పటికే మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాలకు ఫుడ్ లైసెన్స్ జారీ చేశారు.

పెద్దమ్మతల్లి ప్రసాదం
ప్రముఖ ఆలయాలను సందర్శించడంతో పాటు కార్యనిర్వహణ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. భాగ్యనగరంలోని ఎనిమిది దేవాలయాల్లో లైసెన్స్ జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. పెద్దమ్మతల్లి ప్రసాదానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పొందుతుంది.












Click it and Unblock the Notifications