తెలంగాణలో మరో 4 కేసులు.. 24కు చేరిన సంఖ్య
తెలంగాణలో ఒమిక్రాన్ హడలెత్తిస్తోంది. ఇప్పటికే 20 కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 4 కేసులు వచ్చాయి. దీంతో ఆందోళన నెలకొంది. ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు తొలి స్థానంలో కొనసాగుతుంటే.. తెలంగాణ సెకండ్ ప్లేస్ లో నిలుస్తోంది. తెలంగాణలో 20 కేసులుంటే.. తాజాగా..మరో నలుగురు ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 24కి చేరింది.

4 కేసులు..
తెలంగాణలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఎట్ రిస్క్ దేశాల నుంచి 726 మంది శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో వారి శాంపిల్స్ను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించారు.

9122 మంది ప్యాసెంజర్స్
ఇప్పటివరకు విదేశాల నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 9122 మంది ప్రయాణికులు వచ్చారు. వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. 59 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. వారందరి శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించారు. వీరిలో 24 మందికి ఒమిక్రాన్ వేరియంట్గా తేలింది. మరో 13 మంది ఫలితాలు రావాల్సి ఉంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39,919 కరోనా టెస్టులు చేయగా కొత్తగా 172 మందికి పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3625 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఒకరు సీరియస్
టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైరస్ బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మిగతా వారిలో స్వల్ప లక్షణాలే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఒమిక్రాన్ను గుర్తించే జీనోమ్ సీక్వెన్సింగ్ను ఏర్పాటు చేస్తుంది. గాంధీ ఆసుపత్రిలో ఒమిక్రాన్ జీనోమ్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి వస్తే రోజుకు 48 శాంపిళ్లను పరీక్షించే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇవాళ వచ్చిన కేసుల్ో ఇద్దరు నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చినవారు. మరో ఒకరు కాంటాక్ట్ పర్సన్ నుంచి వైరస్ సోకింది. రాష్ట్రంలో మొత్తం కేసులు 24కి చేరాయి.

లక్షణాలే లేవట..?
80 శాతం కేసుల్లో అసలు లక్షణాలే లేవని వైద్యారోగ్యశాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ తెలిపారు. మరో 13 శాతం కేసుల్లో స్వల్ప లక్షణాలే ఉన్నట్టు చెప్పారు. దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటి వరకు 100 దేశాలకు వ్యాప్తి చెందింది. యూరప్లో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అమెరికాలో సైతం ఈ రకం కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications