Hyderabad: పార్కింగ్ ఫీ వసూలు చేసినందుకు రూ.50 వేల జరిమానా.. షాపింగ్ మాల్స్ కు షాకిచ్చిన అధికారులు..
కొంత మంది షాపింగ్ కు వెళ్లినప్పుడు అక్కడ వారు పార్కింగ్ ఫీజు వసూలు చేస్తారు. వాస్తవానికి అలా చేయకూడుదు. కానీ చాలా షామింగ్ మాల్స్ యజమానులు పార్కింగ్ ఫీజు వసూలు చేస్తారు. ఇలా పార్కింగ్ ఫీజు వసూలు చేసినందకు హైదరాబాద్కూకట్పల్లిలోని ఓ మాల్ కు రూ.50 వేల ఫైన్ విధించారు.
రాష్ట్ర ప్రభుత్వం 2018లో జారీ చేసిన జిఓ ఎంఎస్ 63 ప్రకారం నిబంధనలను ఉల్లంఘించి పార్కింగ్ ఫీజులు వసూలు చేసినందుకు కూకట్పల్లిలోని మంజీరా మాల్కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి)లోని ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇవి అండ్ డిఎం) వింగ్ జరిమానా విధించింది.

వాణిజ్య సంస్థల ద్వారా పార్కింగ్ రుసుము వసూలు చేయడాన్ని GO రద్దు చేసింది. సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ (సిఇసి) గత శనివారం వారి యాప్ ద్వారా ఫిర్యాదును స్వీకరించింది, అందులో ఫిర్యాదుదారు వాణిజ్య సంస్థ జారీ చేసిన పార్కింగ్ టిక్కెట్ను సమర్పించారు. యాజమాన్యం పార్కింగ్ రుసుము వసూలు చేస్తుందని CEC ధృవీకరించి ఫైన్ విధించింది.
తాజాగా బేగంపేట మెట్రో స్టేషన్ సమీపంలోని మై హోమ్ టైకూన్ షాపింగ్ మాల్పై కూడా పార్కింగ్ ఫీ వసూలు చేసినందుకు ఫైన్ పడింది. ఒక కస్టమర్ నుంచి అక్రమంగా పార్కింగ్ రుసుము రూ.10 వసూలు చేసినందుకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం ఆ షాపింగ్ మాల్ పై రూ.50వేల ఫైన్ వేసింది.
జే సురానా అనే వ్యక్తి.. ట్విటర్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాపింగ్ మాల్ పై చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. తెలంగాణ అపార్ట్మెంట్స్ యాక్ట్స్ అండ్ రూల్స్, 1987లోని 28, 24. జీవో168 ప్రకారం.. వినియోగదారుడు బిల్ చూపించినా కూడా పార్కింగ్ ఫీజును వసూలు చేయడం చట్టవిరుద్ధం.












Click it and Unblock the Notifications