హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌కు భారీ ఎత్తున అమ్మోనియం నైట్రేట్... గవర్నర్ తమిళిసై ఆందోళన...

|
Google Oneindia TeluguNews

చెన్నై నుంచి హైదరాబాద్‌కు 697 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ని తరలించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ ఈ వేలంలో దీన్ని కొనుగోలు చేయడంతో కంటైనర్ల ద్వారా హైదరాబాద్ తరలించారు. మొదట ఆదివారం కొన్ని కంటైనర్లు నగరానికి చేరగా... సోమవారం రాత్రి మరికొన్ని కంటైనర్లు చేరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.

విజయవాడ మరో బీరుట్‌లా: కొండపల్లిలోనూ అమ్మోనియం నైట్రేట్: పవన్ కల్యాణ్ కొత్త వాదనవిజయవాడ మరో బీరుట్‌లా: కొండపల్లిలోనూ అమ్మోనియం నైట్రేట్: పవన్ కల్యాణ్ కొత్త వాదన

అమ్మోనియం నైట్రేట్‌ హైదరాబాద్‌కు తరలింపుపై ట్విట్టర్‌లో గవర్నర్ స్పందించారు. 'ఆదివారం రాత్రి అమ్మోనియం నైట్రేట్‌ను హైదరాబాద్ తరలించినట్లు తెలియడంతో ప్రజల భద్రత గురించి ఆందోళనకు గురయ్యాను. పరిస్థితిని అంచనా వేసి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి సంబంధిత అధికారులతో మాట్లాడాను.' అని ట్విట్టర్‌లో తమిళిసై పేర్కొన్నారు.

governor tamilisai soundara rajan concern over ammonium nitrate shifting from chennai to hyd

ఇటీవల లెబనాన్ రాజధాని బీరట్‌లో పేలుళ్ల తర్వాత అమ్మోనియం నైట్రేట్ నిల్వలపై భారత్‌లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా హైదరాబాద్‌కు తరలించిన అమ్మోనియం నైట్రేట్ కెమికల్ లోడ్‌ గత ఐదేళ్లుగా గోదాముల్లోనే నిల్వ ఉంది. తమిళనాడుకు చెందిన ఓ కంపెనీ దక్షిణ కొరియా నుంచి 2015లో దాదాపు 742 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను నిల్వ చేసింది. అయితే సరైన లైసెన్స్ లేని కారణంగా కస్టమ్స్ అధికారులు ఈ కెమికల్ లోడ్‌ను సీజ్ చేశారు. చెన్నై వరదల కారణంగా ఇందులో కెమికల్ వృథాగా పోయింది. మిగిలిన 697 టన్నుల కెమికల్‌ను హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ కొనుగోలు చేసింది. దీంతో ఆదివారం రాత్రి నుంచి ఈ లోడ్‌ను చెన్నై నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు.

Recommended Video

Khairtabad Ganesha : No Permission For Devotees To Visit Khairatabad Ganesha

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరంలో దాదాపు 18500 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. బీరట్‌లో 2700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వలతో భారీ పేలుళ్లు సంభవించడంతో... ఇంత భారీ ఎత్తున విశాఖలో కెమికల్ నిల్వ ఉండటంపై ఆందోళన వ్యక్తమైంది. అయితే సురక్షిత పద్దతిలోనే దాన్ని నిల్వ చేశారని.. ప్రమాదమేమీ లేదని అధికారులు నిర్దారించారు.

English summary
Governor Tamilisai Soundara Rajan raised concern over saftey of people after hearing shift of ammonium nitrate from Chennai to Hyderabad.She reached out hte officials to asses and follow up the situation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X