ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: స్టే ఎత్తివేసిన హైకోర్టు, పోలీసుల ఎంక్వైరీ, కస్టడీ..?
ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కేసులో మొయినాబాద్ పోలీసులకు రిలీఫ్ కలిగింది. ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపిన ఆ ముగ్గురిని విచారించేందుకు హైకోర్టు అనుమతించింది. ఇదివరకు ఉన్న స్టేను ఎత్తివేసింది. కానీ కస్టడీ కోసం మొయినాబాద్ పోలీసులు రేపు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంది. అక్కడ వాదనల తర్వాత 14 రోజుల కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.
కేసు దర్యాప్తుపై ఇప్పటివరకు స్టే ఉన్న సంగతి తెలిసిందే. దానిని మంగళవారం హైకోర్టు ధర్మాసనం ఎత్తివేసింది. కేసు విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున బీజేపీ పిటిషన్పై విచారణ జరగనుంది. కేసును పోలీసులు కాకుండా ప్రత్యేక దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని కోరుతుంది. మరోవైపు రాష్ట్రంలో సీబీఐకి ప్రవేశం లేదని తెలంగాణ ప్రభుత్వం జీవో తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సీబీఐ విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం కోరే అవకాశం లేదు. ఒకవేళ హైకోర్టు విచారణ జరపాలని కోరితే మాత్రం ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం ముగ్గురు నిందితులు జైలులోనే ఉన్నారు. అయితే 3 రోజుల కింద సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. అప్పుడు కొనుగోలు అంశానికి సంబంధించి వివరాలు తెలియజేశారు. వీడియో కూడా విడుదల చేశారు. దీనిపై బీజేపీ తరఫు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అమిత్ షా, నడ్డా, మోడీ పేరు చెప్పడం నిబంధనలకు ఉల్లంఘన కిందకు వస్తోందని తెలియజేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కోసం రామచంద్ర భారతి అండ్ కో ప్రయత్నించారు. పైలట్ రోహిత్ రెడ్డితో మాట్లాడగా.. ఆ ఆడియో, వీడియో ఫుటేజీ బయటకు వచ్చింది. రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని చెప్పగా.. సదరు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఆదేశాలతో మొయినాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications