కేసీఆర్ మానస పుత్రికకు అరుదైన గౌరవం.. అంతర్జాతీయ సదస్సు ఆహ్వానం
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మానస పుత్రికకు అరుదైన గౌరవం లభించింది. మిషన్ కాకతీయ పథకానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. దీని నిర్వహణకు సంబంధించి తెలంగాణ సాగునీటి శాఖ ఇంజనీర్లు ప్రజంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇంటర్నేషనల్ కమిషన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ సంస్థ ఆహ్వానం పలకడం విశేషం.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయతో పాటు మరో రెండు పథకాలపై కూడా అంతర్జాతీయ సదస్సులో ప్రజంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరింది. మిషన్ కాకతీయ చిన్న నీటి వనరుల పునరుద్ధరణ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణ - నీటి వృధాను అరికట్టే పద్దతులు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకాలను వివరించాలని కోరింది.

ఇండోనేషియాలోని బాలిలో త్వరలో జరగనున్న ఈ సదస్సులో నీటిపారుదల శాఖ ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే ఆధ్వర్యంలోని బృందం ఈ మూడు అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు అధికారులు. అయితే తెలంగాణలో కీలకమైన మూడు పథకాలకు సంబంధించి అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం రావడంతో హర్షం వ్యక్తమవుతోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications