హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కోడెల పార్ధివదేహం.. ఉదయం గుంటూరుకు,
ఏపీ మాజీ స్పీకర్ కోడెల మృతదేహానికి హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టమ్ పూర్తయింది. ముగ్గురు డాక్టర్ల బృందం ఆయనకు పోస్ట్ మార్టమ్ నిర్వహించింది.అనంతరం ఆయన పార్ధీవాదేహాన్ని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు తీసుకువచ్చారు. దీంతో పార్టీ కార్యకర్తలు,నాయకులు చేరుకున్నారు. పార్టీ కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే బాలక్రిష్ణ నివాళులు అర్పించారు. కాగా ఉదయం వరకు ఆయన పార్ధీవ దేహాన్ని ఎన్టీఆర్ భవన్లోనే కార్యకర్తల సందర్శనార్ధం ఉంచనున్నారు.
కాగా అమరావతిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాత్రి 9గంటలకు వరకు హైదరాబాద్ చేరుకోనున్నారు. అనంతరం టీడీపీ కార్యాలయానికి చేరుకుని కోడెల మృతదేహానికి నివాళులు అర్పించనున్నారు. కాగ ఉదయం ఎనిమిది గంటలకు కోడెల పార్ధీవ దేహాన్ని గుంటూరు పార్టీ కార్యాలయానికి రోడ్డు మార్గం ద్వార తరలించనున్నారు.

కోడెలతో పార్ధీవ దేహంతోపాటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం వెళ్లనున్నట్టు సమాచారం.కాగా సాయంత్రం నాలుగు గంటల వరకు పార్టీ కార్యాలయంలో ఉంచి అనంతరం నరసరావుపేటకు తరలించనున్నారు. కుటుంభ సభ్యులతో మాట్లాడి బుధవారం అంత్యక్రియలు నిర్వహించాలనే యోచనలో పార్టీ శ్రేణులు ఉన్నట్టు సమాచారం.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications