లిఫ్ట్ వైర్ తెగిపడి.. 200 అడుగుల ఎత్తు నుంచి కిందపడి..!
ఆదిలాబాద్ : ప్రాజెక్టు నిర్మాణంలో అపశృతి చోటుచేసుకుంది. జైనథ్ మండలం చనాక కొరాట బ్యారేజ్ పనుల్లో ఇద్దరు కూలీలు మృత్యువాత పడ్డారు.
ఇటీవల బ్యారేజ్ నిర్మాణం పనులు వేగవంతమైన తరుణంలో ఇలాంటి ఘటన జరగడంతో స్థానికంగా విషాదం నెలకొంది. పెన్ గంగా నదిపై నిర్మిస్తున్న బ్యారేజ్ పనుల్లో భాగంగా ప్రమాదవశాత్తు లిఫ్ట్ వైర్ తెగిపడింది.
నిర్మాణం పనుల్లో భాగంగా బ్యారేజ్ గేట్లు బిగిస్తుండగా ఒక్కసారిగా లిఫ్ట్ వైర్ తెగిపడింది. దాంతో ఇద్దరు కూలీలు మృత్యువాత పడగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అదలావుంటే బ్యారేజీకి సంబంధించి ఇంకా మూడు గేట్లు బిగించాల్సి ఉన్న తరుణంలో ఇలాంటి విషాదం చోటుచేసుకోవడంతో తోటి కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

బుధవారం నాడు పదహారవ నెంబర్ గేటు బిగిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా లిఫ్ట్ వైర్ తెగిపడటంతో దాదాపు రెండు వందల అడుగుల ఎత్తు నుంచి నలుగురు కూలీలు కిందపడ్డారు. అందులో ఇద్దరు స్పాట్లో చనిపోగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు చెబుతున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications