పాడి కౌశిక్ రెడ్డికి మధురై కోర్టు సమన్లు, పరువు నష్టం దావా కేసులో
టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి మధురై కోర్టు సమన్లు జారీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇంచార్జీ మాణిక్కం ఠాకూర్పై కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీంతో కోర్టు సమన్లు ఇష్యూ చేసింది. మాణిక్కం ఠాకూర్ పీసీసీ పదవీని రూ.40 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు. దీంతో మాణిక్కం ఠాకూర్ కౌశిక్ రెడ్డిపై మధురై కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

వారెంట్ జారీచేస్తాం..
పిటిషన్ విచారణకు స్వీకరించింది. పాడి కౌశిక్ రెడ్డి తరపున ఎవరూ హాజరు కాకుంటే వారెంట్ జారీ చేస్తామని వెల్లడించింది. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేసేందుకు రూ.40 కోట్లు తీసుకున్నారని కౌశిక్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై అప్పటి తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మాణికం ఠాగూర్ ఈ మేరకు పిటిషన్ వేశారు.

ప్రతిష్టకు భంగం
ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా రిప్లై కూడా చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడిన కౌశిక్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తున్నానని అప్పుడే చెప్పారు. మధురై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు కోర్టు సమన్లు జారీచేసింది. సీఎం కేసీఆర్కు విధేయులైన వారు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుంటారని మాణికం ఠాగూర్ గతంలో అన్నారు.

కాంగ్రెస్లో ఉండి..
కౌశిక్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్కు కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీని ఇచ్చారు. ఆ తర్వాత ఈటల పార్టీ మారడంతో.. హుజురాబాద్లో ఉన్న నేతలను గులాబీ పార్టీ ఆకర్షించింది. అందులో భాగంగానే కౌశిక్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు.

పోటీ చేయలే.. కానీ
ఈటల రాజీనామాతో వచ్చిన బై పోల్లో కౌశిక్ రెడ్డి పోటీ చేయలేదు. కానీ ఇచ్చిన మాట మేరకు ఆయనను ఎమ్మెల్సీని చేశారు. అంతకుముందు గవర్నర్ తమిళి సై కూడా కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీని చేసేందుకు అంగీకరించలేదు. దీంతో కేసీఆర్- తమిళి సై మధ్య దూరం పెరిగింది. అదీ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఏదో ఒక అంశంపై గొడవ జరుగుతూనే ఉంటుంది. పదే పదే ఢిల్లీకి వెళ్తూ.. హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అవుతుంటారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications