అన్నీ గ్రామాలను చింతమడకల ఎందుకు చేయరు.. కేసీఆర్పై మురళీధర్రావు గుస్సా
హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు. ఆయన చేసే తుగ్గక్ చర్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. ప్రజల సంక్షేమాన్ని కేసీఆర్ విస్మరించారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు ఒక్కటేనని సంచలన ఆరోపణలు చేశారు మురళీధర్రావు. వాటి ఎజెండా ఒక్కటేనని కామెంట్ చేశారు. ఇవాళ చింతమడకలో పర్యటించిన కేసీఆర్ .. తన ఊరికి నిధులు ప్రకటించారని గుర్తుచేశారు. అయితే రాష్ట్రంలోని మిగతా గ్రామాలను ఎందుకు అభివృద్ధి చేయరని ప్రశ్నించారు. దీంతోపాటు కొత్త మున్సిపల్ చట్టానికి కూడా భవిష్యత్ లేదని మండిపడ్డారు. అంతేకాదు తెలంగాణకు కేంద్రం ఇస్తోన్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు.

రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందనే భయం కేసీఆర్ను వెంటాడుతుందని ఆరోపించారు. అందుకోసమే బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీపై మతతత్వ ముద్ర వేస్తున్నారని పేర్కొన్నారు. ఇటు రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని స్పష్టంచేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ నుంచి మరింత మంది బీజేపీలో చేరతారని సూత్రప్రాయంగా తెలిపారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications